బుల్లితెరపై ప్రస్తుతం చాలామంది యాంకర్లు హవా నడుపిస్తున్న విషయం తెలిసిందే. ఇలా బుల్లితెర ప్రేక్షకులందరికీ ఎక్కువగా దగ్గరయ్యి... బుల్లితెర రాములమ్మ గా పేరు తెచ్చుకుని.. ప్రస్తుత ఉన్న యాంకర్ లో టాప్ ప్లేస్ లో దూసుకుపోతుంది శ్రీముఖి. అప్పుడు వరకు తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలియని శ్రీముఖి ఈటీవీ ప్లస్ లో ప్రసారమైన పటాస్ ప్రోగ్రాం తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయిపోయింది. ఈ షో లో  తన వాక్చాతుర్యంతో ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పటి వరకు ఎంత మంది యాంకర్లు  ఉన్నప్పటికీ తనదైన డిఫరెంట్ యాంకరింగ్ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇలా పటాస్ ప్రోగ్రాం ద్వారా ఎంతగానో క్రేజ్ తెచ్చుకుంది ఈ అమ్మడు. ఇక ఆ తర్వాత ఏ సినిమా ఈవెంట్ లో చూసిన ఈ అమ్మడే దర్శనమిచ్చింది. 

 

 

 ఇక పటాస్ ప్రోగ్రాం లో చేస్తున్న సమయంలోనే బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా వెళ్లేందుకు అవకాశం రావడంతో అప్పటికే టాప్ ప్లేస్ లో దూసుకుపోతున్నప్పటికీ అన్ని పక్కన పెట్టేసి బిగ్ బాస్ లోకి వెళ్ళింది. ఇక అక్కడ తనదైన శైలిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది  ఈ అమ్మడు. మొదటి రోజు నుంచి చివరి దాకా కొనసాగింది. బిగ్ బాస్ హౌస్ లో అల్లరి చేస్తూ టాస్కూల్లో తనదైన పర్ఫామెన్స్ ఇస్తూ ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించింది. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ టైటిల్ రన్నరప్ గా  నిలిచింది శ్రీముఖి. ఇక బిగ్ బాస్ కి వెళ్ళిన తరువాత ఈ అమ్మడి క్రేజ్ బాగా పెరిగి పోయిన విషయం తెలుసిందే. 

 

 

 అయితే శ్రీముఖి ప్రస్తుతం వరుస ప్రోగ్రాం లతో బిజీ బిజీగా ఉంది. బిగ్ బాస్ హౌస్ నుండి వచ్చిన తర్వాత మరింత జోష్ పెంచింది ఈ ముద్దుగుమ్మ. ఈ మధ్యకాలంలో హాట్ హాట్ అందాలతో ప్రేక్షకులను కూడా అలరిస్తోంది. అయితే తాజాగా శ్రీముఖి ఈటీవీలో ప్రసారమయ్యే  సుమా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న క్యాష్ ప్రోగ్రాం కి హాజరైనది... ఈ సందర్భంగా తాను తల్లి కాబోతున్న అంటూ అందరికీ షాక్ ఇచ్చింది శ్రీముఖి. క్యాష్ లో ఓ టాస్క్ లో  ఎలాంటి సందర్భాల్లో స్వీట్లు పంచుతారు అని సుమ అడిగిన క్వశ్చన్ కి... నేను తల్లి కాబోతున్నాను అంటూ సమాధానం ఇచ్చి.. ఇలాంటి సందర్భాల్లో స్వీట్లు అందరికీ పంచిపెడతారు అంటూ తెలిపింది. ఇక వెంటనే స్పందించిన సుమ ఈ ఒక్క డైలాగ్ చాలు  ప్రోమో లో వేసుకోవడానికి అంటూ చమత్కరించింది .

మరింత సమాచారం తెలుసుకోండి: