సినీ పరిశ్రమలో ఇప్పటి వరకు ఎంతో మంది హీరో, హీరోయిన్లపై ఫేక్ న్యూస్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే ప్రతిసారి వీటిపై స్పందించి ఇవన్నీ ఫేక్ న్యూస్.. ఇలాంటి పుకార్లు ఎలా రాస్తారు అని ప్రశ్నిస్తుంటారు సెలబ్రెటీలు. తాజాగా ఇదే పరిస్థితి మాలీవుడ్ బ్యూటీ కీర్తి సురేష్ కి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఆమె కుటుంబసభ్యులు ఇప్పటికే వరుడిని చూశారని.. పెద్దలు కుదర్చిన పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి.
ఈ ఏడాది చివరిలో వీరి వివాహానికి సన్నాహాలు జరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే దీనికి సంబంధించి కీర్తి సురేష్ కుటుంబం నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. తన పెళ్లికి సంబంధించి చక్కర్లు కొడుతున్న వార్తలపై ప్రముఖ నటి కీర్తి సురేశ్ స్పందించింది. బీజేపీ నేతతో ఆమెకు పెళ్లి నిశ్చయమైందని, పెళ్లి ఘనంగా జరగబోతోందని, ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని రకరకాల వార్తలు గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్నాయి.. అసలు ఇలాంటి వార్తలు ఎలా వస్తాయి.. ఎలా వైరల్ చేస్తారని అశ్చర్యపోయింది.
కాగా దక్షిణాదిలో తనకంటూ గుర్తింపు పొందిన కీర్తి సురేష్ ‘మహానటి’ చిత్రానికి జాతీయ ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు. మరోవైపు తెలుగు, తమిళ చిత్రాలతో ఆమె బిజీగా ఉన్నారు. కాగా, ఈ వార్తల్లో ఎంతమాత్రమూ నిజం లేదని తేల్చిచెప్పింది. వదంతులను వ్యాపింప చేయవద్దని కోరింది. మరో ఏడాది వరకు కాల్షీట్స్ ఇచ్చానని, ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లెలా చేసుకుంటానని ఎదురు ప్రశ్నించింది. ప్రముఖ దర్శకుడు కుకునూర్ నగేశ్ తొలిసారి తెలుగులో తెరకెక్కిస్తున్న స్పోర్ట్స్ బ్యాక్డ్రాఫ్ సినిమాలో ప్రస్తుతం కీర్తి సురేశ్ నటిస్తున్నారు. 'గుడ్ లక్ సఖి' అనే పేరును వస్తున్న ఈ సినిమాలో కీర్తి డీ- గ్లామర్ పాత్రలో కనిపించనున్నారు