చిరంజీవి సౌత్ ఇండియన్ మెగాస్టార్. అమితాబ్ ఆలిండియా సూపర్ స్టార్. ఈ ఇద్దరిదీ ఎన్నో ఏళ్ళ బంధం. ఇక మెగాస్టార్ చిరంజీవి, అమితాబ్ కలసి  ఈ మధ్యనే పాన్ ఇండియా మూవీగా సైరా నరసింహారెడ్డి చేశారు. ఈ మూవీలో మెగా హీరోకు బిగ్ బీ అమితాబ్  గురువుగా నటించి ఆడియన్స్ మెప్పు పొందారు.

 

సరే ఆ సినిమా తరువాత మళ్ళీ ఈ ఇద్దరి కలయిక ఎపుడా అని అభిమానజనమంతా ఎదురుచూస్తున్నారు. కరోనా వైరస్ పుణ్యాన బిగ్ బీతో చిరంజీవి జత కడుతున్నారు. ఎక్కడా అంటే ఓ వీడియోలో. కరోనాపై ప్రజలను చైతన్యం చేస్తూ మొత్తం ఆల్ ఇండియా సూపర్ స్టార్లు అంతా కలసి చేస్తున్నా ఈ వీడియో సాంగులో అమితాబ్ తో చిరు కూడా బుల్లి తెరను పంచుకుంటున్నారు.

 

ఈ వీడియో తొందరలోనే జనం ముందుకు రాబోతోంది. ఈ వీడియో ద్వారా మొత్తం భారతీయ చలన చిత్ర రంగ హీరోలంతా కూడా కరోనా వైరస్ ముప్పు గురించి మొత్తం దేశ ప్రజలకు వివరించనున్నారు. కరోనా నుంచి కాపాడుకునేందుకు ఎవరికి వారుగా స్వీయ నియంత్రణ పాటించాలని కూడా హెచ్చరించనున్నారు. అదే విధంగా కరోనా వైరస్ ని కట్టడి చేసి దేశం నుంచి తరిమేయడానికి కూడా సలహాలు సూచనలు పాట రూపంలో అందించనున్నారు  మరిపుడు కూడా అదిరిపోవడమేనా. చూడాలి  ఈ జోడీ ముచ్చటను.

 

మొత్తం మీద కరోనా వైరస్ మీద రూపొందించిన ఈ వీడియో మెగా ఫ్యాన్స్ ని మరో మారు అలరించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే తన సాటి నటుడు నాగ్, తమ్ముడు కొడుకు వరున్ తేజ్, మేనల్లుడు సాయి తేజ్ లతో కలసి నాగ్ చేసిన కరోనా వైరస్ మీద సాంగ్ కి మంచి స్పందన లభించింది. ప్రధాని మోడీ సైతం దాన్ని మెచ్చుకున్నారు కూడా.

 

మరింత సమాచారం తెలుసుకోండి: