తెలుగులో మల్టీ స్టారర్ మూవీస్ కి కాలం చెల్లింది అని అంతా అనుకుంటున్న వేళ కొన్ని సినిమాలు ఇపుడు వస్తున్నాయి. అయితే వాటిని పూర్తిగా మల్టీ స్టారర్ గా చెప్పలేం. ఎందుకంటే సీనియర్ హీరోలు, టాప్ స్టార్లు కలసి నటిస్తున్నారు. సమఉజ్జీలుగా ఉన్న ఇద్దరు హీరోలు నటిస్తేనే అది అచ్చమైన మల్టీస్టారర్ గా చెప్పాలి.

 

ఆ రకంగా మిగిలిన భాషల్లో మూవీస్ ఉన్నాయి. తెలుగులో మాత్రం ఇంకా ఆ ట్రెండ్ రాలేదు. అయితే ఆ ముచ్చట ఇపుడు తీరనుంది అంటున్నారు. అదెలా అంటే పవన్ కళ్యాణ్, రవితేజ కలసి నటిస్తారని టాక్ ఇపుడు టాలీవుడ్లో వినిపిస్తోంది. ఈ మూవీకి సంబంధించి ప్రాధమికంగా అంతా ఓకేగా ఉందిట. అంటే ఇక సెట్స్ మీదకు వెళ్ళడానికి ఎక్కువ టైం పట్టకపోవచ్చు అంటున్నారు.

 

నిజానికి రవితేజాకు మెగా క్యాంప్ తో మంచి రిలేషన్లు ఉన్నాయి. ఆయన అన్నయ్య మూవీలో మెగాస్టార్ చిరంజీవితో కలసి నటించారు. ఒక తమ్ముడిగా ఆ మూవీలో కనిపిస్తారు. ఇక రవితేజ తన ఆరాధ్య హీరో మెగాస్టార్ అని కూడా చెబుతారు. ఇక ఆ కుటుంబంలో మళ్ళీ రవితేజ బాగా అభిమానించే హీరోగా పవన్ కళ్యాణ్ ఉంటారు. ఆ మధ్య రవితేజ నేల టికెట్ మూవీ అడియో ఫంక్షన్ కి పవన్ హాజరై తన బెస్ట్  విషెస్ తెలిపారు కూడా. అదే టైంలో రవితేజాతో తన స్నేహాన్ని కూడా చాటుకున్నారు.

 

 

ఇంత మంచి స్నెహం ఇపుడు తెర మీద గొప్పగా కనిపించేలా డైరెక్టర్ డాలీ సినిమా  స్క్రిప్ట్ ని తీర్చిదిద్దుతున్నారుట. ఈ సినిమాను రవితేజాతో నేల టికెట్ తీసిన రాం తాళ్ళూరి ఎస్సార్టీ మూవీ పతాకంపైన తీస్తారని అంటున్నారు. ఈ మూవీ విషయంలో వినిపిస్తున్న అప్డేట్స్ బట్టీ చూస్తే ఇది పక్కా మాస్ మసాలా గా ఉండబోతోందిలా ఉంది. మరి చూడాలి ఎపుడు సెట్స్ మీదకు ఈ మూవీ వస్తుందో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: