టాలీవుడ్ లో ఉన్న సక్సస్ ఫుల్ డైరెక్టర్స్ లో రాజమౌళి తర్వాత అంతటి గొప్ప పేరు ని సంపాదించుకున్నారు కొరటాల శివ. ప్రముఖ దర్శకులు పోసాని మురళీ కృష్ణ దగ్గర పని చేసిన కొరటాల శివ రచయితగా సినిమా కెరీర్ మొదలు పెట్టి ఎన్నో సక్సస్ ఫుల్ సినిమాలకి పని చేశారు. ఇక కొరటాల శివ 'మిర్చి' సినిమాతో డైరెక్టర్ అయ్యారు. ఈ సినిమాతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి మంచి సూపర్ హిట్ ని ఇచ్చారు.

 

డెబ్యూ సినిమాతోనే తెలుగు ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకున్నారు. దాంతో కొరటాలకి వరసగా స్టార్ హీరోలతో సినిమాలు తెరకెక్కించే అవకాశాలని అందుకున్నారు. మిర్చి తర్వాత మహేష్ బాబు తో శ్రీమంతుడు, ఎన్.టి.ఆర్ తో జనతా గ్యారేజ్, మళ్ళీ మహేష్ బాబు తో భరత్ అనే నేను సినిమాలు తీశారు. ఇప్పటి వరకు కొరటాల శివ తీసిన సినిమాలన్ని బ్లాక్ బస్టర్స్ కావడం విశేషం. చెప్పాలంటే ఇది కొరటాల కి రికార్డ్ అనే చెప్పాలి.

 

ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి తో 'ఆచార్య' సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం కొరటాల దాదాపు రెండేళ్ళు ఎదురు చూశారు. అది ఆయన కమిట్‌మెంట్ అంటే. ఇప్పటికే ఆచార్య ఒక షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకుంది. దేవదాయ దర్మదాయ శాఖలో జరుగుతున్న అక్రమాల నేపథ్యంలో ఈ సినిమాని కొరటాల రూపొందిస్తున్నారు. అయితే ప్రస్తుతం కరోనా వేగంగా వ్యాపిస్తూ ఎందరో అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్న నేపథ్యంలో ప్రధాని మోదీ, ఇరు రాష్ట్రాల ముఖ్య మంత్రుల ఆదేశాల మేరకు లాక్ డౌన్ విధించారు.

 

ఈ లాక్‌డౌన్ వల్ల చాలా వరకు కరోనా భారిన పడకుండా ఉండటం చాలా గొప్ప విషయం. ఈ నేపథ్యం లోనే గత రెండు వారాలుగా అందరూ ఇంటికే పరిమితమయ్యారు. దీంతో ఎంతో మందికి ఉపాధి కరువైంది. ఇందుకోసం చాలామంది సెలబ్రిటీస్ ముందుకు వచ్చి పేదలను ఆదుకుంటున్న విషయం కూడా హర్షించదగ్గ విషయం.  

 

అయితే ఇంతకంటే గొప్ప విషయం మరొకటి ఉండటం చాలా ఆసక్తికరం. ఆచార్య సినిమా ని తెరకెక్కిస్తున్న దర్శకుడు కొరటాల శివ గురించి మెగాస్టార్ చిరంజీవి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. కొరటాల తీసిన సినిమాలన్నిటిలోను సామాజిక అంశం, సమాజంలో ప్రతీ ఒక్కరు పాటించాల్సిన బాధ్యత గురించి ప్రత్యేకించి సన్నివేశాల రూపంలో చూపిస్తుంటారు. అంతేకాదు ఇప్పటి వరకు కొరటాల తీసిన సినిమాలన్నిటిలోను కథా నేపథ్యం మొత్తం సామాజిక అంశం చుట్టే తిరుగుతుంటుంది. 

 

అయితే కొరటాల ఇలా సినిమాలలోనే కాదు ఆయన నిజ జీవితం లోను సమాజం పట్ల బాధ్యతని తీసుకొని చాలా కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్న విషయం మాత్రం ఇప్పటి వరకు ఏ ఒక్కరికి తెలీదు. ఈ ఆసక్తికరమైన విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా వెల్లడించారు. కొరటాల శివ పిల్లలని కంటే సమాజం గురించి ఆలోచించ లేనని జీవితాంతం పిల్లలని వద్దనుకున్నారట. సమాజం కోసం ఇలాంటి నిర్ణయం తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు. సమాజాన్నే తన కన్న బిడ్డలా భావించిన కొరటాల ఎంతో మందికి ఆదర్శం.   

మరింత సమాచారం తెలుసుకోండి: