ప్రస్తుతం అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాను గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీవాసు, వాసు వర్మలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వరుసగా మూడు ఫ్లాప్స్ తర్వాత అఖిల్ చాలా ఆశలు పెట్టుకొని నటిస్తున్న ఈ సినిమా హిట్ అవడం అఖిల్ కి చాలా కీలకమని చెప్పాలి. అంతేకాదు డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ కి ఈ సినిమా సక్సస్ తప్పని సరి. చాలా ఏళ్ళ తర్వాత వచ్చిన అవకాశం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'. 

 

ఇక ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిందట. కొంత టాకీ పార్ట్ సాంగ్స్ బ్యాలెన్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. బ్యాలెన్స్ షూటింగ్ కంప్లీట్ చేసి సమ్మర్ లో సినిమాని రిలీజ్ ప్లాన్ చేయాలనుకున్నారట చిత్ర యూనిట్. కాని కరోనా దెబ్బతో అన్ని సినిమాల మాదిరిగానే అఖిల్ సినిమాని ఆపేశారు. ఇది ఒకరకంగా చిత్ర యూనిట్ కంటే కూడా ఎక్కువ ప్రభావం దర్శకుడు భాస్కర్ హీరో అఖిల్ మీద పడిందని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తుంది. ఇక ఈ సినిమాలో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ బ్యూటీ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. వరుసగా సక్సస్ లను దక్కించుకుంటూ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిన ఈ బ్యూటి గమతం లో నాగ చైతన్య సరసన ఒక లైలా కోసం సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. 

 

ఆ తర్వాత బాలీవుడ్ లో హృతిక్ రోషన్ కి జంటగా మొహంజాదారో సినిమాలో నటించింది. ఆ సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఆ దెబ్బతో తిరిగి దువ్వాడ జగన్నాధం సినిమాతో మళ్ళీ టాలీవుడ్ కి వచ్చి స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఈ ఇయర్ ప్రారంభంలోనే అల్లు అర్జున్ తో నటించిన అల వైకుంఠపురములో సినిమాతో బ్లాక్ బస్టర్ ని అందుకుంది. రెమ్యూనరేషన్ పరంగా కూడా ప్రస్తుతం పూజా హెగ్డే బాగా డిమాండ్ చేస్తుంది. అయితే ప్రస్తుతం అఖిల్ తో నటిస్తున్న'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాలో పూజా హెగ్డే సెట్ కాలేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అఖిల్ పక్కన చూస్తే పూజా హెగ్డే కాస్త పెద్దదిగా కనిపిస్తుందని చెప్పుకుంటున్నారట. మరి ఇది నిజంగా సినిమాకి మైనస్ అవుతుందా అన్నది రిలీజ్ అయ్యాకే తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: