టి. కృష్ణ వారసుడిగా 'తొలి వలపు' సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన హీరో గోపీచంద్. యజ్ఞం, ఆంధ్రుడు, గోలీమార్, లక్ష్యం, రణం, లౌక్యం చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే కొంతకాలంగా గోపీచంద్ సక్సెస్ లేక బాగా వెనకబడిపోయారు. గత కొన్నేళ్ళుగా సూపర్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఒకప్పుడు వరుస హిట్లతో నిర్మాతల హీరోగా ఉన్న గోపీచంద్ పరిస్థితి ప్రస్తుతం మారిపోయింది. ఆయన మార్కెట్ బాగా తగ్గిపోయింది. గడిచిన మూడేళ్లలో వరుసగా ఐదు డిజాస్టర్లను గోపీచంద్ అందించారు. ‘జిల్’ సినిమా యావరేజ్ గా నిలిచినా తర్వాత వచ్చిన సినిమాలు పరాజయాన్ని చవిచూశాయి. సౌఖ్యం తో మొదలైన పరాజయాలు ‘పంతం’ వరకు కొనసాగాయి. స్క్రిప్ట్ సెలెక్షన్స్ లో చేసిన పొరపాటు వల్ల ఆయన విజయాలకు దూరమయ్యాడని చెప్పవచ్చు 

 

ప్రస్తుతం సంపత్‌ నంది దర్శకత్వంలో స్పోర్ట్స్‌ బేస్డ్‌ సినిమా ‘సీటీమార్‌’ వస్తోన్న సంగతి తెలిసిందే. అయితే గోపీచంద్  ఎన్నో ఆశలతో చేసిన ‘చాణక్య’ కూడా నిరాశపరచడంతో తరువాత సినిమా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ముఖ్యంగా సరైన దర్శకులతోనే సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నాడు. తనకు నటుడిగా లైఫ్ ఇచ్చి ఇండస్ట్రీలో తనను నిలబెట్టిన దర్శకుడు తేజతో గోపీచంద్ సినిమా చేయబోతున్నాడట. ఇప్పటికే డైరెక్టర్ తేజ గోపీచంద్‌ కోసం ఓ యాక్షన్ స్క్రిప్ట్ ను సిద్ధం చేశాడట.

 

ఇప్పటికే ఈ స్క్రిప్ట్ విషయంలో వీరిద్దరి మధ్య చర్చలు కూడా జరిగాయని, పూర్తిగా పాత్ర బలంతో నడిచే కథ కావడంతో గోపీచంద్ కి కూడా బాగా నచ్చిందని సమాచారం. నవంబర్ నుండి వీరి సినిమా పట్టాలైక్కే అవకాశముంది. మొత్తానికి మరో పవర్ ఫుల్ రోల్ లో యాక్షన్ హీరో నటించబోతున్నాడు. ఇక డైరెక్టర్ తేజ దర్శకత్వంలో వచ్చిన ‘జయం, నిజం’ సినిమాలతో ప్రతినాయకుడిగా నిలదొక్కుకున్న గోపీచంద్ ఈ సారి హీరోగా తేజ దర్శకత్వంలో సూపర్ హిట్ అందుకుంటాడేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: