ఇటీవల టాలీవుడ్ సూపర్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బహుబలి రెండు భాగాల సూపర్ సక్సెస్ తరువాత ఇటు యావత్ ఇండియా వ్యాప్తంగానే కాక అటు పలు ఇతర దేశాల్లో కూడా రెబల్ స్టార్ ప్రభాస్ కు విపరీతంగా క్రేజ్, మార్కెట్ ఏర్పడింది. ఇక ఆపై ఆయన నటించిన సాహో సినిమాపై విపరీతమైన అంచనాలు ఏర్పడడం జరిగింది. అయితే గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా అంచనాలు అందుకోలేకపోయింది. ఇక దాని తరువాత ప్రస్తుతం జిల్ మూవీ తీసిన యువ దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న ప్రభాస్, ఎలాగైనా ఆ సినిమాతో మంచి హిట్ కొట్టాలని చూస్తున్నారు. 

 

పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ పెద్దనాన్న కృష్ణంరాజు ఒక కీలక పాత్రలో నటిస్తుండగా యువి క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంస్థలు ఎంతో భారీ ఖర్చుతో ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ముందుగా ఈ సినిమాకు జాన్ అనే టైటిల్ అనుకున్నారని, అయితే ఆ తరువాత సమంత, శర్వానంద్ ల కలయికలో జాను మూవీ రావడంతో ఆ టైటిల్ కాకుండా మరొక టైటిల్ ని సెట్ చేసిందట సినిమా యూనిట్. కాగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమాకి ఓ డియర్ అనే టైటిల్ ని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేసారని అంటున్నారు. వాస్తవానికి ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని మొన్నటి ఉగాది పండుగ సందర్భంగా రిలీజ్ చేస్తారని ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ భావించారు. 

 

అయితే కొన్ని అనుకోని కారణాల వలన పండగ నాడు ఫస్ట్ లుక్ రిలీజ్ కాకపోవడంతో ఫ్యాన్స్ కొంత నిరాశ చెందారు. అయితే నిన్నటి నుండి ప్రభాస్ 20 మూవీ టైటిల్ ఓ డియర్ అని ఫిక్స్ అయిందని, అలానే ఫస్ట్ లుక్ పోస్టర్ ఇదేనంటూ ఒక పోస్టర్ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్టర్ ఒకటి విపరీతంగా వైరల్ అవుతుండడంతో ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల అందరూ కూడా నిజమే అనుకున్నారు. అయితే ఫైనల్ గా అది నిజం కాదని, కేవలం ఒక అభిమాని డిజైన్ చేసిన ఫ్యాన్ మేడ్ పోస్టర్ మాత్రమే అని తెలిసింది. వాస్తవానికి ఫ్యాన్ మేడ్ పోస్టర్ అయినప్పటికీ కూడా అది అదిరిపోవడంతో, ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఇలానే ఉంటే బాగుంటుందని పలువురు ప్రభాస్ ఫ్యాన్స్ అంటున్నారు....... !!

మరింత సమాచారం తెలుసుకోండి: