అంతకుముందు వరకూ పెద్దగా పట్టించుకోని బాలీవుడ్  ఇప్పుడు పనికట్టుకుని సౌత్ సినిమాలను రీమేక్ చేస్తోంది.  ఈ రీమేక్ లు హిందీలో కూడా వర్కవుట్ అవుతుండడంతో కంప్లీట్ గా ఇక్కడి సినిమాలమీదే కాన్సన్ ట్రేట్ చేస్తున్నారు టాప్ హీరోలు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు. అలా రీసెంట్ గా తెలుగులో హిట్ అయిన భీష్మ సినిమాని కూడా రీమేక్ చెయ్యడానికి రెడీ అయ్యాడు స్టార్ హీరో రణబీర్.

 

బాలీవుడ్ రీమేక్ ల లిస్ట్ లో తెలుగు నుంచి మరో సినిమా యాడ్ అయ్యింది. నితిన్, రష్మిక జంటగా రీసెంట్ గా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన సినిమా భీష్మ. వెంకీ కుడుముల డైరెక్షన్ లో వచ్చిన ఈసినిమా మంచి సక్సెస్ అందుకుంది. అందుకే ఈ సినిమా మీద బాలీవుడ్ కన్నేసింది. ఈ మద్య వరుసగా తెలుగు సినిమాల మీద మనసు పారేసుకుంటున్న కరణ్ జోహార్ ఈ భీష్మ సినిమా ను కూడా రీమేక్ చేద్దామన్న ఆలోచనలో ఉన్నాడట.

 

రణబీర్ సింగ్  హీరోగా ఈ సినిమాని తెరకెక్కిద్దామని చూస్తున్నాడట కరణ్. కరణ్ జోహార్ .. ఇప్పటికే  డియర్ కామ్రడ్ సినిమా రైట్స్ ని సినిమా చూడకముందే కొనేశాడు. భీష్మ తో పాటు డియర్ కామ్రేడ్ కూడా రీమేక్ కి రెడీ గా ఉంది.  భీష్మ కంటే ముందే అల్లు అర్జున్ కి అదరిపోయే హిట్ ఇచ్చిన అలవైకుంటపురంలో  సినిమా మీద కూడా బాలీవుడ్ స్టార్ హీరో కన్ను పడింది. సూపర్ సక్సెస్ అయిన ఈ సినిమాను సల్మాన్ ఖాన్ రీమేక్ చేద్దామన్నప్లాన్ లో ఉన్నాడట. నార్త్ నేటివిటీకి తగ్గట్లు ఇంకాస్త గ్రాండియర్ ను యాడ్ చేసి తెరకెక్కించేలా ప్లాన్ చేస్తున్నాడట సల్మాన్ ఖాన్.

 

అర్జున్ రెడ్డితో తెలుగు  సినిమాని కబీర్ సింగ్ గా రీమేక్ చేసిన షాహిద్ కపూర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ సక్సెస్ అందుకున్నాడు.  మళ్లీ తెలుగు రీమేక్ నే నెక్ట్స్ సినిమాగా ఎంచుకున్నాడు. తెలుగులో గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో నాని హీరోగా వచ్చి సూపర్ హిట్ అయిన జెర్సీ సినిమాని రీమేక్ చేస్తున్నాడు షాహిద్
బాలీవుడ్ యాక్షన్ కింగ్  కూడా సౌత్ సినిమాల మీద ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: