మెగాస్టార్ చిరంజీవి హీరోగా సామాజిక సందేశాత్మక చిత్రాల దర్శకుడు కొరటాల శివ ఆచార్య అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు. సినిమా పేరుని ఇంకా అధికారికంగా రివీల్ చేయకపోయినప్పటికీ ఆచార్య అన్న పేరునే కన్ఫర్మ్ అయిపోయినట్టే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం కరోనా కారణంగా కొన్ని రోజులపాటు వాయిదా పడింది. లాక్ డౌన్ పూర్తయిన వెంటనే చిత్రీకరణ జరుపుకోనుంది.

 

ఖైదీ నంబర్ 150 సినిమాలో హీరోయిన్ గా నటించిన కాజల్ మరోసారి చిరంజీవి సరసన నటిస్తుంది. అయితే ఈ సినిమాలో మరో ప్రధాన పాత్రలో చరణ్ నటిస్తున్నాడని సమాచారం. ముందుగా ఈ పాత్రలో మహేష్ నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి. కానీ ఏమైందో ఏమో గానీ చివరికి ఈ పాత్రలో చరణ్ ని ఫిక్స్ చేసారట. అయితే ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే రామ్ చరణ్సినిమా కనిపించడం సందేహమే అనిపిస్తుంది. 

 

కరోనా కారణంగా అన్ని సినిమాల షూటింగ్స్ ఆగిపోవడంతో చరణ్ ఆచార్య సినిమాకి డేట్స్ ఇచ్చే పరిస్థితి కనిపించట్లేదు. రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ కోసం సినిమా పూర్తయ్యే వరకు చరణ్ ని లాక్ చేశాడు. రాజమౌళి అనుమతి ఇస్తేనేగానీ చరణ్ ఆచార్య సినిమాలో చేయడు. ఇప్పటికే ఒకసారి వాయిదా పడి వచ్చే సంవత్సరానికి వెళ్ళిపోయిన ఆర్.ఆర్.ఆర్ ని కాదని రాజమౌళి చరణ్ కి పర్మిషన్ ఇచ్చే ప్రసక్తే లేదు.

 

అనుకున్న సమయానికి విడుదల చేయాలన్న సంకల్పంతో రాజమౌళి పోస్ట్ ప్రొడక్షన్ ని కూడా స్టార్ట్ చేశాడు. అయితే ఇందులో చరణ్ చేయకపోతే ఆ స్థానంలో పవన్ ని నటింపజేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి ఎప్పటి నుండో అనుకుంటున్నట్టుగా పవన్ చిరంజీవిని ఒకే సినిమాలో చూడడానికి మరెంతో సమయం పట్టదు

మరింత సమాచారం తెలుసుకోండి: