టాలీవుడ్ లో లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు మంచి హిట్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. ప్రతి మూవీలో తనదైన మార్క్ చాటుకునే సుకుమార్ ఆ మద్య రామ్ చరణ్, సమంత జంటగా తెరకెక్కించిన ‘రంగస్థలం’ సూపర్ హిట్ అయ్యింది. 1983 నాటి పరిస్థితులకు అద్దం పట్టే విధంగా అప్పటి రాజకీయాలకు, ప్రేమ అన్ని సమ్మిళితం చేసి తెరకెక్కించిన ఈ మూవీ మంచి హిట్ అయ్యింది. ఇందులో రామ్ చరణ్ ని సరికొత్తగా చూపించిన విషయం తెలిసిందే. అంతకు ముందు ఎన్టీఆర్ ని ‘నాన్నకు ప్రేమతో’ లో చాలా డిఫరెంట్ గా ప్రజెంట్ చేశారు సుకుమార్.
ఇలా 'నాన్నకు ప్రేమతో' సినిమాతో క్లాస్ ఆడియన్స్ ను ఆకట్టుకున్న సుకుమార్, 'రంగస్థలం' సినిమాతో మాస్ ఆడియన్స్ ను అలరించాడు. ఏ మూవీలో అయినా తన మార్క్ హీరోయిజం చూపిస్తుంటారు సుకుమార్. టాలీవుడ్ లో సుక్కు కి ఇష్టమైన హీరో అల్లు అర్జున్. వీరిద్దరి కాంబినేషన్ లో ఆర్య, ఆర్య 2 రూపొందిన విషయం తెలిసిందే. ఈ సారి కూడా ఆయన మరో మాస్ సబ్జెక్ట్ ను సిద్ధం చేసుకున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఈ సినిమాలో లారీ డ్రైవర్ గా బన్నీ కనిపించనున్నాడు. ఆయన సరసన నాయికగా రష్మికను తీసుకున్నారు.
ఈ మూవీలో అల్లు అర్జున్ ని ఊరమాస్ లుక్ లో చూపించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుత లాక్ డౌన్ కారణంగా షూటింగుకి వెళ్లడం ఆలస్యమవుతోంది. దాంతో ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 28వ తేదీన విడుదల చేయాలని సుకుమార్ భావిస్తున్నట్టుగా చెబుతున్నారు. సాధారణంగా సుకుమార్ తన సినిమాల విషయంలో ప్రతి ఒక్కటీ లెక్కలు చూసుకొని మరీ ముందుకు సాగుతుంటారు. అందువల్లనే ఆయన ఈ రిలీజ్ డేట్ సెట్ చేసుకున్నాడని చెప్పుకుంటున్నారు. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా విజయ్ సేతుపతి కనిపించనున్న సంగతి తెలిసిందే.