టాలీవుడ్ లో ఇప్పుడు పూజ హెగ్డే హవా ఎక్కువగా నడుస్తుంది. ఆమె చేసే సినిమాల మీద ఎక్కువగా ఆసక్తి నెలకొంది. వరుస ఆఫర్లతో పూజ దూసుకుపోతుంది. పూజ వరుస ఆఫర్లతో ఎప్పటికప్పుడు బిజీ గానే ఉంటుంది. అగ్ర దర్శకులు ఆమెకు అవకాశాలు ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ ఏడాది అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అల వైకుంఠపురములో సినిమాలో నటించింది. 

 

ఈ సినిమాలో బుట్ట బొమ్మగా పూజ నటన పరంగా కూడా బాగానే ఆకట్టుకుంది. ఇప్పుడు ఆమెకు వరుసగా బాలీవుడ్ లో ఆఫర్లు వస్తున్నాయి. అక్కడ దాదాపు నాలుగు సినిమాలను ఆమె ఓకే చేసింది అనేది టాలీవుడ్ జనాల టాక్. ఆమెతో సినిమాలు చేయడానికి అగ్ర దర్శకు లు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పుడు ఆమె ధరలు పెంచినట్టు సమాచారం. రేటు బాగా పెంచింది అనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. 

 

ఆమె నాలుగు కోట్ల వరకు వసూలు చేసే ఆలోచనలో ఉందీ అనేది టాలీవుడ్, బాలీవుడ్ జనాల మాట. ఆమెకు ఇప్పుడు రణబీర్ కపూర్ తో పాటుగా సల్మాన్ ఖాన్ తో కూడా సినిమా చేసే అవకాశం వచ్చింది. దీనితో ఇక తెలుగు లో స్టార్ హీరోలతో సినిమాలు చేసి భారీగా వసూలు చేసే ఆలోచనలో ఉంది పూజ. అందుకే చిన్న హీరోలతో సినిమాలు చేసే ఆలోచన తనకు లేదని చెప్పినట్టు సమాచారం. ఇక ఆమె తెలుగులో ప్రభాస్ తో అఖిల్ తో రెండు సినిమాలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: