బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్‌ తెరెక్కించిన సీరియల్స్‌, వెబ్‌ సిరీస్‌లు మాత్రమే కాదు తన వ్యవహార శైలి కూడా ఎప్పుడూ వివాదాస్పద మవుతూనే ఉంటుంది. ఇటీవల జాతీయ నాయకురాలు స్మృతి ఇరానీ విసిరిన సేఫ్‌ హ్యాండ్స్ చాలెంజ్‌లో భాగంగా ఏక్తా చేతులు కడిగిన వీడియో కూడా విమర్శలకు కారణమైంది. చేతి నిండా ఉంగరాలు బ్రాసెలెట్లు ధరించి చేతులు కడుక్కోవటం ఏంటి అంటూ నెటిజెన్లు ఏక్తాను విమర్శించారు. కొందరైతే నీ చేతి ఉంగరాలు థానోస్ లా ఉన్నాయంటూ విమర్శించారు.

 

అయితే అప్పుడు ఈ విమర్శలపై స్పందించకపోయినా తాజాగా ఆ విమర్శలకు కౌంటర్ ఇచ్చింది ఏక్తా కపూర్. తన చేతికి ఎలాంటి ఉంగరాలు, బ్రాస్‌ లెట్‌ లు లేకుండా ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఏక్తా.. `థానోస్‌ బిల్డింగ్ వదిలి వెళ్లిపోయాడు. అతడు ప్రపంచాన్ని కావాల్సినంత నాశనం చేశాడు. సరాదా కామెంట్‌` అంటూ కామెంట్ చేసింది.

 

ఈ విషయాన్ని పక్కన పెడితేకరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న తన ఎంప్లాయిస్ కోసం భారీ సాయాన్ని ప్రటించింది ఈ భామ. ఒక ఏడాది పాటు తాను జీతం తీసుకోనని ప్రకటించింది. ఈ మొత్తం దాదాపు 2.5 కోట్ల రూపాయల వరకు ఉంటుంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Meanwhile in other news! Thanos has left d building !!! He destroyed d world enough ! Just kidding !!! #goinghandsfree #onehandatatime

A post shared by Erk❤️rek (@ektarkapoor) on

మరింత సమాచారం తెలుసుకోండి: