టాలీవుడ్ లో ఈ సంవత్సరం సంక్రాంతి పండుగకు  ఘనంగా విడుదలైన సినిమాలలో ఒక్కటి ‘అల వైకుంఠపురములో’. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. ఆ సినిమా ఏకంగా రూ. 150 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. అయితే ఇప్పుడు ఈ సినిమాని హిందీలో రీమేక్ చేయడానికి భారీగా సన్నాహాలు మొదలు పెట్టారు. ఈ మధ్య ఈ సినిమాకి సంబంధించిన డిజిటల్, శాటిలైట్ రైట్స్ భారీ రేటుకే అమ్మిన సంగతి మనందరికి తెలిసిన సంగతే.

 


అయితే తాజాగా ఈ సినిమా రీమేక్ రైట్స్‌ ను ప్రముఖ బాలీవుడ్ నిర్మాత అశ్విన్ వర్దె భారీ రేటుకు కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని... గత సంవత్సరం షాహిద్ కపూర్‌ తో అర్జున్ రెడ్డి రీమేక్ గా కబీర్ సింగ్ సినిమాను నిర్మించిన ప్రొడక్షన్ వల్లే ఇప్పుడు ఈ సినిమా రీమేక్ రైట్స్ ను కొనుగోలు చేసారు. అయితే ఇప్పుడు హిందీలో ఈ సినిమాలో షాహిద్ కపూర్‌ తో తెరకెక్కిస్తారని సమాచారం తెలుస్తోంది.

 

 

 
అయితే ఇప్పటికే బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్, టాలీవుడ్ లో హిట్ అయిన జెర్సీ మూవీని హిందీలో అదే టైటిల్‌ తో ప్రస్తుతం రీమేక్ చేస్తున్నాడు. దాని తర్వాత తాజాగా  ‘అల వైకుంఠపురములో’ సినిమాను కూడా రీమేక్ చేయడానికి తాను రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. ముందుగా ఈ రీమేక్‌ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్‌ లేదా అక్షయ్ కుమార్ పేర్లు బాగా వినిపించాయి. అయితే చివరికి మాత్రం తాజాగా షాహిద్ కపూర్‌ ఈ సినిమా రీమేక్‌ లో యాక్ట్ చేయడానికి ఓకే చెప్పినట్టు బాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. కాకపోతే టాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘అల వైకుంఠపురములో’ చిత్రం రీమేక్ బాలీవుడ్ ప్రేక్షకులను ఏ మాత్రం అలరిస్తుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: