కొంత మంది హీరోయిన్లు గ్లామర్ పాత్రల్లో నటిస్తేనే అవకాశాలు వస్తాయి కానీ రకుల్ మాత్రం అందుకు విరుద్ధంగా చెపుతోంది. “నాకు అవకాశాలు తగ్గిపోయాయంటే అందుకు కారణం.. గ్లామరస్ పాత్రల్లో నటించడమేన”ని రకుల్ప్రీత్సింగ్ పేర్కొంది. “నేను తప్పు చేశాను. అది నాకు ఇప్పటికి తెలిసింది. నటనకు ప్రాధాన్యత కలిగిన పాత్రలను ఎంపిక చేసుకోకుండా కేవలం గ్లామర్కే పరిమితం అయ్యానని, ఫలితంగా.. అవకాశాలు దూరం అయ్యాయ”ని ఆవేదన వ్యక్తం చేసింది.
ఏదైనా అనుభవంలోకి వచ్చే వరకూ తెలియదంటారు. రకుల్ప్రీత్సింగ్ పరిస్థితి కూడా అంతే. తెలుగు ప్రేక్షకులను తన అందాలతో అలరించిన ఆమెకు స్టార్ ఇమేజ్ వచ్చింది. స్టార్ హీరోలందరితోనూ జత కట్టింది. అయితే,ఇప్పుడు అవకాశాలు ముఖం చాటేస్తున్నాయి. అవకాశాలు అడుగంటడానికి కారణాలు విశ్లేషించుకున్నట్టుంది. దీని గురించి మాట్లాడుతూ.. తాను వరుసగా అందాలారబోతకే ప్రాధాన్యతనిచ్చానని, అది ఎంత పెద్ద తప్పో ఇప్పుడు అర్థమైందని అంది. తాను ఏ దర్శక, నిర్మాతకు సమస్యలు తెచ్చి పెట్టలేదని.. పారితోషికం విషయంలో కూడా పట్టు విడుపు పాటించానని చెప్పింది. ఎవరితోనూ గొడవ పడలేదంది. షూటింగ్లకు టైమ్కు వెళ్లేదాన్నని అంది. అయినా అవకాశాలు తగ్గిపోయాయంటే అందుకు కారణం తాను గ్లామరస్గా నటించడమేనని పేర్కొంది. నటనకు ప్రాధాన్యత కలిగిన పాత్రలను ఎంపిక చేసుకోకుండా.. కేవలం గ్లామర్కే పరిమితం అయ్యానని, ఫలితం అవకాశాలు దూరం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేసింది.
రకుల్ ప్రీత్ సింగ్ పేదవారికి తన వంతు సాయాన్ని అందించడానికి సిద్ధమయ్యింది. కరోనా వైరస్ ప్రభావంతో పేద ప్రజలు..రోజువారీ కార్మికులు తిండి కోసం నానా కష్టాలు పడుతున్నారు.వారిని ఆదుకోవడానికి పలువురు సినీ తారలు తమ వంతు సాయాన్ని అందిస్తున్నారు. తాజాగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేదవారికి తన వంతు సాయాన్ని అందించడానికి సిద్ధమయ్యింది. గుర్గావ్లోని తన ఇంటికి సమీపంలోని మురికివాడలోని పేద కుటుంబాలకు రోజుకు రెండు పూటల తిండిని అందిస్తున్నారు.