మహానటి... సినిమాతో తనలో ఉన్న నట విశ్వరూపాన్ని కీర్తి సురేష్ చూపించింది. అప్పటి వరకు మంచి నటిగా ఆమెకు గుర్తింపు రాలేదు. ఆమె చేసే సినిమాలు కూడా ఆమెకు అప్పటి వరకు మంచి గుర్తింపు తీసుకుని రాలేదు అనేది ఎవరూ కాధనలేని వాస్తవం. ఆమె ఈ సినిమా ద్వారా ఒకరకంగా చెప్పాలి అంటే స్టార్ హీరోయిన్ అయిపోయింది. తెలుగులో తమిళంలో లక్షల మంది అభిమానులను సంపాదించుకున్నారు. 

 

ఆమెకు ఈ సినిమా అన్ని రకాలుగా హెల్ప్ అయింది. ఇక ఇప్పుడు ఆమె మరో బయోపిక్ కి సిద్దం అవుతున్నట్టు టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. ఒకప్పుడు టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన సౌందర్య జీవిత కథ ఆధారంగా ఆమె ఈ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దర్శకుడు రాఘవేంద్ర రావు ఈ సినిమా మీద ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారని టాక్ వినపడుతుంది. 

 

అందుకోసం కీర్తి అయితే సరిగా సరిపోతుంది అనే భావనలో ఆయన ఉన్నారు. అందుకే ఇప్పటికే ఆమెను కూడా ఈ సినిమా గురించి అడిగినట్టు సమాచారం. దీనికి కీర్తి కూడా ఓకే చెప్పింది అంటున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే జూలై నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే ఆలోచనలో ఉందని టాక్. మరి ఇది ఎంత వరకు నిజమో చూడాలి. ఆమె ఈ సినిమాను చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంది. నిర్మాతగా దగ్గుబాటి సురేష్ బాబు వ్యవహరిస్తారని టాక్. చూద్దాం... ఈ సినిమాకు సంబంధించి కథ కూడా రెడీ చేస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: