టాలీవుడ్ లో మళ్ళీ కీర్తి సురేష్ బిజీ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. టాలీవుడ్ లో బిజీ అయినట్టే అయి కొన్నాళ్ళు తప్పుకుంది. మహానటి సినిమా తో ఆమె మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమా ఆమెకు ఎక్కడ లేని గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ సినిమా ద్వారా టాలీవుడ్ లో ఆమె ప్రత్యేకంగా ఫాన్స్ బేస్ ని పెంచుకుంది. టాలీవుడ్ జనాలు కూడా ఆమె కోసం ఎదురు చూస్తున్నారు ఈ మధ్య కాలంలో. 

 

ఇప్పుడు ఆమె మళ్ళీ బిజీ అయి సినిమాలు చెయ్యాలని చూస్తుంది. ఆమె మహానటి తర్వాత సినిమాలకు దూరంగా ఉంది. తనకు సావిత్రి ఫోబియా ఉందని ఏ సినిమా చేసినా సరే తాను పాత్రలో పూర్తిగా లీనం కాలేక పోతున్నా అని చెప్పింది కూడా. ఇప్పుడు మన తెలుగులో ఆమె కోసం అగ్ర దర్శకులు పోటీ పడుతున్నట్టు తెలుస్తుంది. కొరటాల శివ తన తర్వాతి సినిమాలో ఆమెను తీసుకోవాలని చూస్తున్నాడని టాక్. 

 

ఇక మహేష్ బాబు కూడా పరుశురాం దర్శకత్వంలో చేసే సినిమాలో కీర్తి కోసం ప్రయత్నాలు చేసినట్టు సమాచారం. ఈ మధ్య దీనికి సంబంధించి వార్తలు కూడా వచ్చాయి. ఇక కీర్తి సురేష్ తో సౌందర్య బయోపిక్ తీయాలని అగ్ర దర్శకుడు రాఘవేంద్ర రావు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా వరుస ఆఫర్లతో కీర్తి బిజీ అవుతుంది. చాలా మంది హీరోలు కూడా ఆమెతో సినిమా చెయ్యాలని ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అటు తమిళంలో కూడా ఆమెకు మంచి క్రేజ్ ఉండటం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: