జాన్వీ కపూర్ కోసం ఇప్పుడు బాలీవుడ్ హీరో లే కాదు... టాలీవుడ్ హీరో లు కూడా ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. ఆమెకు గతంలో క్రేజ్ ఉండేది కాదు గాని పాప అడిగిన వారికి అడిగినంత అనే సిద్దాంతంలో సినిమాలు చేయడం తో ఆమె తో సినిమా చేసేందుకు నిర్మాతలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఆమె సినిమాలు అన్నీ కీలక దశలో ఉన్నాయి. కొత్త సినిమాలకు కూడా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

 

ఈ సినిమాలు అన్నీ వచ్చే ఏడాది విడుదల అయ్యేవే. యువ హీరోయిన్ కావడం, నటన అందం అన్నీ కూడా బాగానే ఉన్న నేపధ్యంలో ఆమె తో సినిమా చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇది పక్కన పెడితే ఇప్పుడు మహేష్ బాబు చేసే తర్వాతి సినిమాలో ఆమె హీరోయిన్ అని అంటున్నారు. ఆమె కోసం మహేష్ బాబు పట్టు బట్టి మరీ ఓకే చేసాడని అంటున్నారు. దానికి కారణం ఆయన సినిమాలు బాలీవుడ్ లో ఆడటానికే. 

 

బాలీవుడ్ లో ఆమెకు మంచి క్రేజ్ ఉంది. అందుకే ఆమె తో సినిమా చేస్తే మంచి లాభం ఉంటుంది అని మహేష్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఆమె కూడా భారీగానే మహేష్ సినిమాకు డిమాండ్ చేసినట్టు సమాచారం. మహేష్ ప్రస్తుతం పరుశురాం తో సినిమా చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాడు. ఈ సినిమా కథ దాదాపుగా పూర్తి అయింది కూడా. త్వరలోనే సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: