మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఎలా అయినా సరే సినిమా చెయ్యాలి అని పట్టుదల మీద ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు అనుకున్న మాటను నేరవేర్చుకున్నాడా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. మహేష్ బాబు ఎలా అయినా సరే సినిమా చెయ్యాలని ఎప్పటి నుంచో పట్టుదలగా ఉన్నాడు. మహర్షి సినిమా తర్వాత ఆయన త్రివిక్రమ్ తో సినిమా చేసేందుకు ప్రయత్నాలు చేసాడు. అయితే కొన్ని కారణాల వలన ఆ సినిమా ముందుకి వెళ్ళలేదు. 

 

ఇప్పుడు త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నాడు. తర్వాతి సినిమా ఏంటీ అనేది స్పష్టత లేదు. అయితే మహేష్ బాబు మాత్రం తనతో సినిమా చెయ్యాలని ఇప్పటికే అడ్వాన్స్ కూడా ఇచ్చినట్టు టాక్. ఈ సినిమాకు తానే పూర్తి స్థాయి నిర్మాతగా వ్యవహరిస్తానని షేర్ కూడా ఇస్తానని చెప్పాడట మహేష్. దీనిని చూసి టాలీవుడ్ జనాలు కూడా షాక్ అయ్యారు. ఈ సినిమా అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది జూన్ తర్వాత సెట్స్ మీదకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. 

 

సినిమా కోసం మహేష్ వంశీ పైడపల్లి ని కూడా పక్కన పెట్టాడని టాలీవుడ్ లో టాక్. ఇక ఈ సినిమా మీద త్రివిక్రమ్ కూడా ఆసక్తి చూపించాడని అంటున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ తో చేస్తున్న సినిమాను వచ్చే ఏడాది మే లో విడుదల చేసి మహేష్ తో చేసే సినిమాను జులై నుంచి మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. త్వరలోనే దీనిపై ఒక కీలక వార్త కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: