తెలుగులో నానీ కి మంచి క్రేజ్ ఉంది. వరుస విజయాలతో ఒకప్పుడు నానీ సంచలనం సృష్టించాడు. అయితే ఆ తర్వాత మాత్రం వరుసగా ఫ్లాపులు ఎదుర్కొన్నాడు. భిన్నమైన కథలను ఎంపిక చేసుకున్నా సరే నానీ ని మాత్రం ఫ్లాపులు వెంటాడి వేధించాయి. ఇప్పుడు అతను మంచి హిట్ కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడు రెండు మూడు సినిమాలు  చేస్తున్నాడు. ఈ సినిమాలు అయిన తర్వాత వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక సినిమా చేస్తాడు. 

 

ఇది ఇంకా ఖరారు కాకపోయినా సరే దిల్ రాజు ఈ సినిమా చేయడానికి ఇప్పటికే నానీ ని ఒప్పించారని అంటున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవి ని ఎంపిక చేసారని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ఇది ఎంత వరకు నిజమో తెలియదు గాని దీనిపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సాయి పల్లవి కి నానీ కి ఎంసిఏ సినిమా సమయంలో గొడవలు అయ్యాయి. 

 

అప్పుడు దిల్ రాజు వారి మధ్య సమస్యను పరిష్కరించారు. ఆ తర్వాత ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడం తో ఆ గొడవను హీరో హీరోయిన్ ఇద్దరూ కూడా మర్చిపోయారు. ఇప్పుడు మళ్ళీ కలిసి పని చేయడానికి ఈ ఇద్దరూ ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం. ఈ సినిమా చర్చలు ఇప్పటికే పూర్తి అయ్యాయని హీరో హీరోయిన్లు అడ్వాన్స్ లు కూడా తీసుకున్నారని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా ఈ ఇద్దరు మళ్ళీ సినిమా చేయడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: