టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకతంలో వచ్చిన అలవైకుంఠపురములో సినిమా మంచి సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. మొన్నటి సంక్రాంతి పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కు ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థలు నిర్మించిన ఆ సినిమాలో హీరోయిన్ గా పూజ హెగ్డే నటించగా, ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందించాడు. ఇక ఆ సినిమా ఇచ్చిన జోష్ తో మంచి ఊపుమీదున్న బన్నీ, ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రి మూవీ మేకర్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల శేషాచలం అడవుల్లో జరిగింది. 

 

అయితే కొద్దిరోజులుగా లాకౌట్ నేపథ్యంలో షూటింగ్స్ అన్ని కూడా బంద్ కావడంతో, ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి కొంత ఇంటర్నల్ వర్క్ ని ఇంటి నుండి మూవీ యూనిట్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇటీవల సూపర్ స్టార్ సరసన సరిలేరు నీకెవ్వరు లో నటించి మంచి హిట్ ని సొతం చేసుకున్న యువ భామ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు టాలీవుడ్ వర్గాల టాక్. ఇకపోతే మరొక రెండు రోజుల్లో బన్నీ పుట్టినరోజు కావడంతో, ఆరోజున ఈ సినిమాకు సంబందించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేయబోతున్నట్లు సినిమా నిర్మాతలు కాసేపటి క్రితం ఒక పోస్టర్ ని రిలీజ్ చేసారు. 

 

'ఏమబ్బా అందరూ బాగుండారా, మీరు ఎప్పుడెప్పుడా అని చూస్తాండే అప్డేట్, ఏప్రిల్ 8న, ఉదయం 9 గంటలకు వాస్తాండాది, రెడీ కాండబ్బా' అంటూ ఒక డైలాగ్ ఆ పోస్టర్ లో ఉండడం గమనించవచ్చు. అయితే దీనిని బట్టి ఈ సినిమాలో హీరో బన్నీ, పక్కా మాస్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడని, అలానే ఇందులో ఆయన రాయలసీమ స్లాంగ్ ని మాట్లాడతారని కొందరు బన్నీ ఫ్యాన్స్ దానిపై సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు. మరి 8వ తేదీన ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి పోస్టర్ ని సినిమా యూనిట్ రిలీజ్ చేస్తుందో అని బన్నీ ఫ్యాన్స్ తోపాటు ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: