ప్రపంచాన్ని గడ గడ లాడిస్తున్న కరోనా మహమ్మారి కరోనా ను పూర్తి గా తరిమి కొట్టాలి అనే లాక్ డౌన్ ను కొన సాగిస్తున్నారు. లాక్ డౌన్ ను విధించింది. మార్చి 22 నుంచి  ప్రారంభమైన ఈ లాక్ డౌన్ ఏప్రిల్ 14 వరకు కొనసాగనుంది. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రజల సమస్య లను అర్థం చేసుకుంటూ ప్రముఖ సినీ, రాజకీయ ప్రముఖులు విరాళాలను అందిస్తున్నారు.. కరోనా ప్రభావం ఎంత నియంత్రణ చేసిన కూడా కరోనా ముంచుకొస్తుంది. 

 

 


కరోనా నేపథ్యంలో రోడ్డుపై వదిలేస్తున్నారు. దీంతో అవి తిండి లేక చావు బతుకు ల మధ్య కొట్టుమిట్టాడుతున్నాయి. వాటిని పట్టించుకునే వారే కరవై పోయారు. ఇందుకు సంబంధించి కన్నీరు పెట్టిస్తోన్న కొన్ని వీడియోలను  జబర్దస్త్ యాంకర్‌ రష్మీ పోస్ట్‌ చేసింది. ఆకలితో అలమటిస్తూ, కదలలేక, తలెత్తికూడా చూడలేక మూలుగుతూ శునకాలు ఆ వీడియోల్లో ఉన్నాయి.  

 

 

 


వీటి  ని పోస్ట్ చేసి కేంద్ర మాజీ మంత్రి మేన కా గాంధీకి రష్మీ ఓ విజ్ఞప్తి చేసింది. కుక్కల ను ఎవరూ వదిలేసు కోవద్దని రష్మీ చెప్పింది. కుక్క లను పెంచు కునేందుకు తీసుకున్న సమయంలో యజమానుల నుంచి హామీ తీసుకోవాలని రష్మీ సూచించింది. ఇందుకోసం పత్రాలపై సంతకాలు చేయించుకోవాలని చెప్పింది.

 

 

 

ఎట్టిపరిస్థితుల్లోనూ కుక్కలను వదలబోమని అందులో రాయించాలని కోరింది. ఒట్టి చేతులతో వెళ్లి కుక్కను కొని ఇంటికి తెచ్చుకునే విధానానికి స్వస్తి చెప్పాలని సూచించింది. కుక్కలను పెంచుకునే యజమానుల విషయంలో కఠిన నిబంధనలు అమలు చేయాల్సిన అవసరం ఉందని, ఇలా రోడ్లపై వదిలేసేలా చేయకుండా చర్యలు తీసుకోవాలని చెప్పింది. ఎంతైనా రష్మీ ఎం చేసిన కూడా సోషల్ మీడియాలో అది వైరల్ అవుతూ వస్తుంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: