టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ఎన్నడూ లేనంత సంతోషంగా ఉన్నారు. ఎందుకనగా, ముందుగా భరత్ అనే నేను, ఆ తరువాత మహర్షి, ఆపై ఇటీవల సరిలేరు నీకెవ్వరు, ఇలా మూడు సినిమాలతో వరుసగా మూడు సక్సెస్ లు అందుకుని హ్యాట్రిక్ కొట్టిన మహేష్, ఇటీవల ఆ విజయానందాన్ని ఎంజాయ్ చేయడానికి విదేశాలకు వెళ్లారు. అయితే కొద్దిరోజుల క్రితం కరోనా ప్రపంచవ్యాప్తంగా కోరలు చాచి తన పంజాని విసరడంతో దాదాపుగా మూడు నెలల భారీ టూర్ వేద్దాం అనుకున్న సూపర్ స్టార్ ఫ్యామిలీ దానిని విరమించుకున్నారు. ఇక ప్రస్తుతం లాకౌట్ నేపథ్యంలో సినిమా షూటింగ్స్ పూర్తిగా బంద్ కావడంతో తన ఫ్యామిలీ తో కలసి ఎంతో సరదాగా గడుపుతున్నారు మహేష్. 

 

ఇక ఇటీవల ఒక ప్రముఖ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆయన సతీమణి నమ్రత మాట్లాడుతూ, మహేష్ ప్రస్తుతం తమ పిల్లలతో ఎంతో హ్యాపీగా గడుపుతున్నారని, తనకు తెలిసిన ప్రపంచం సినిమాలు, లేదా పిల్లలు మాత్రమే అని, అయితే ఈ లాకౌట్ వలన పిల్లలతో మరింత ఆనందంగా గడపడానికి తనకి సమయం దొరికిందని నమ్రత వెల్లడించారు. ఇక ఇటీవల కరోనా జాగ్రత్తలపై తన కూతురు సితారతో కలిసి పలు సూచనలను ప్రేక్షకులకు అందించిన సూపర్ స్టార్, నిన్నటి లైట్స్ ఫర్ ఇండియా కార్యక్రమంలో భాగంగా తమ ఇంటి లైట్స్ అన్ని ఆర్పేసి చేతిలో కొవ్వొత్తిని పట్టుకుని ఉన్న ఒక ఫోటోని తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసారు. 

 

ఇక ప్రస్తుతం ఆ ఫోటో ఏకంగా104కె లైక్స్ ని అందుకోవడం జరిగింది. అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ రెండు తెలుగు రాష్ట్రాలకు గాను, యాభై లక్షల చొప్పున కరోనా బాధితులకు చెల్లిస్తున్నట్లు పెట్టిన పోస్ట్ 162కె లైక్స్ ని, అలానే పీఎం రిలీఫ్ ఫండ్ కు కోటి ప్రకటించిన ట్వీట్ కు 137.5కె తో లైక్స్ పాటు, జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల హోలీ సందర్భం పెట్టిన ఫ్యామిలీ పోస్ట్ 103.4 కె లైక్స్ ని అందుకోవడం జరిగింది. అయితే పోస్టుల పరంగా పవన్, ఫోటో పరంగా మహేష్, ఇద్దరూ కూడా ప్రస్తుతం ట్విట్టర్ లో ముందు వరుసలో కొనసాగుతున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: