పవన్ కళ్యాణ్ డై హార్ట్ ఫ్యాన్ యంగ్ హీరో నితిన్ అన్న సంగతి తెలిసిందే. ఆయన హీరోగా పవన్ కళ్యాణ్ కెరీర్ లో టాప్ వన్ స్థానం లో నిలిచిన సినిమా 'తొలి ప్రేమ’ అని ఎవరైనా చెప్తారు. అదే సినిమా టైటిల్ తో సినిమాని తెరకెక్కించి దర్శకుడిగా పరిచయం అయ్యాడు వెంకీ అట్లూరి. మొదటి సినిమాతో సూపర్ హిట్ ని దక్కించుకోలేకపోయినా ఇండస్ట్రీ దృష్ఠిని మాత్రం ఆకర్శించాడు. అయితే మేకింగ్ పరంగా మంచి మార్కులు సంపాదించుకున్న వెంకీ ఆ తర్వాత సినిమాతో గ్యారెంటీగా హిట్ కొడతాడని అందరూ అనుకున్నారు. ఆయన తీసిన ‘మిస్టర్ మజ్ను’ కూడా కాల్స్ మూవీ స్టైలిష్ మేకింగ్ అని పేరొచ్చిందినప్పటికి ఫ్లాప్ గా మిగిలింది. 

 

ప్రస్తుతం ఈ డైరెక్టర్ నితిన్ తో రంగ్ దే సినిమా ని తెరకెక్కిస్తున్నాడు. మహానటి ఫేం కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న విషయం తెల్సిందే. రీసెంట్ గా రిలీజ్ చేసిన పోస్టర్ లుక్ తో సినిమాపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి. హీరో, హీరోయిన్ తో పాటు ప్రొడక్షన్ బ్యానర్ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి వెంకీ అట్లూరి కి కమర్షియల్ సక్సెస్ వస్తుందని ఎంతో ఆశగా ఉన్నాడట.

 

మొదటి రెండు సినిమాలు కమర్షియల్ గా సక్సస్ కాకపోవడంతో వెంకీ అట్లూరి ఆశలన్ని రంగ్ దే సినిమా మీదే పెట్టుకున్నాడు. ఎటువంటి పరిస్థితుల్లో ఈ సినిమా మంచి కమర్షియల్ సక్సస్ ని సాధించాలి. అప్పుడే ఇండస్ట్రీలో కొనసాగుతుతాడు. లేదంటే ఇదే ఆఖరి సినిమా అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. ప్రస్తుతం కరోనా కారణంగా నెలకొన్న పరిస్థితుల్లో ఏ నిర్మాత అనవసరమైన రిస్కులు చేసేలా కనిపిచడం లేదు. ఇప్పటి నుంచి ప్రతీ నిర్మాత సినిమా నిర్మాణం లో ఆచి తూచి అడుగులు వేస్తారు. సో పొరపాటున కూడా ఫ్లాప్ డైరెక్టర్స్ కి ఛాన్స్ ఇవ్వరు. మరి వెంకీ కెరీర్ కి రం దే నే కీలకం. 

మరింత సమాచారం తెలుసుకోండి: