టాలీవుడ్ లో ఇప్పుడు పూజ హెగ్డే హవా ఎక్కువగా నడుస్తుంది అనే విషయం అందరికి తెలిసిందే. ఆమె తో సినిమా చేయడానికి ఎందరో దర్శక నిర్మాతలు పోటీ పడుతూ ఉంటారు అనే విషయం అందరికి తెలిసిందే. ఆమెకు ఇప్పుడు డిమాండ్ ఉండటం తో స్టార్ హీరోలు కూడా ఆమెతో సినిమా చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. కొందరు హీరోలకు ఆమె లక్కీ హీరోయిన్ అని కూడా అంటున్నారు. 

 

ఆమె ఇప్పుడు రెండు సినిమాలు చేస్తుంది. అఖిల్ తో ఒక సినిమా ప్రభాస్ తో ఒక సినిమా చేస్తుంది. ఈ ఏడాది మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఆమె ఒక సినిమా చేసింది. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి అందరికి తెలిసిందే. ఇది పక్కన పెడితే ఆమె ఇప్పుడు నిర్మాతల ముందు ఎక్కువగా డిమాండ్ లు పెడుతుంది అంటున్నారు. స్టార్ హీరోలతోనే సినిమాలు చేస్తా అని డిమాండ్ పెట్టిన సంగతి తెలిసిందే. 

 

ఆమె ఇప్పుడు బాలీవుడ్ సినిమాలను దృష్టి లో ఉంచుకుని ఎక్కువగా డిమాండ్ లు పెడుతుంది అనే వాళ్ళు ఉన్నారు. బాలీవుడ్ లో ఆమె సినిమాలు ఎక్కువగా చేస్తుంది. దాదాపు నాలుగు సినిమాలకు ఆమె అక్కడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనితో ఆమె ఇక్కడ సినిమాలకు ఎక్కువగా డేట్స్ ఇవ్వలేను అని చెప్పడం గమనార్హం. ఇప్పుడు చేసే సినిమాలను పూర్తి చేస్తా అని తర్వాత ఇచ్చే డేట్స్ మాత్రం చాలా జాగ్రత్తగా ఇస్తా అని తనకు బాలీవుడ్ ముఖ్యం అని చెప్పినట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: