టాలీవుడ్ లో ఇప్పుడు మహేష్ బాబుకి డిమాండ్ ఉంది. ఆయన నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా ఫ్లాప్ అయినా సరే ఆయనతో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు ఎక్కువగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన సినిమా అనగానే టాలీవుడ్ లో ఆయన ఫాన్స్ కి ఒక రకంగా పండగే. ఇది పక్కన పెడితే ఆయన ఇప్పుడు సరికొత్త ఆలోచనతో ముందుకి వెళ్తున్నారు. వరుసగా సినిమాలు చేస్తున్న మహేష్ బాబు ఇప్పుడు గ్యాప్ ఇచ్చే ఆలోచనలో ఉన్నాడు. 

 

వాస్తవానికి సరిలేరు నీకవ్వరు సినిమా మహేష్ బాబుకి చేదు జ్ఞాపకం. ఆయన ఈ సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నా వసూళ్ళ పరంగా ఈ సినిమా ఆయనకు భారీ షాక్ ఇచ్చింది. దీనితో ఇప్పుడు రెండేళ్లకు పైగా సమయం తీసుకుని సినిమా చేసే ఆలోచనలో మహేష్ బాబు ఉన్నాడని సమాచారం. ఇక నుంచి ఏ సినిమా అయినా సరే రెండేళ్ళ సమయం తీసుకుని సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు మహేష్ బాబు. 

 

ఇక తన సినిమాల్లో పెట్టుబడి తానే పెట్టుకోవాలని కూడా భావిస్తున్నట్టు సమాచారం. మార్కెట్ ఎక్కువగా ఉన్న నేపధ్యంలో మహేష్ బాబు ఈ ఆలోచన చేసినట్టు తెలుస్తుంది. అగ్ర హీరో అయినా సరే మహేష్ తో నిర్మాతలు బాగా ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఇప్పుడు మహేష్ బాబు ఎవరి తో గొడవలు లేకుండా చాల జాగ్రత్తగా సినిమాలు చేసుకోవాలని ఎవరి తో లింక్ వద్దు అనే భావన లో మహేష్ బాబు ఉన్నాడని అంటున్నారు. ఆయన భార్య నమ్రత కూడా ఇదే విషయం మహేష్ కి చెప్పినట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: