లాక్ డౌన్ పీరియడ్ లో అందరూ రకరకాల పనులు చేస్తున్నారు. కరీనా కపూర్ మాత్రమే ఏ పని చేసినట్టు గానీ, చేస్తున్నట్టు కానీ సోషల్ మీడియాలో పెట్టలేదు. పనులు చెయ్యకపోయినా.. పనులు చేయిస్తూ.. ఫ్యాన్స్ కి, తన తోటి స్టార్లకి మాత్రం పనులు చెయ్యమని చెబుతోంది.
పుస్తకాలు చదువుతూ, స్వీట్లు తింటూ టైమ్ పాస్ చేస్తున్న ఈ దొరసానికి ఇప్పుడు కొడుకును చూస్కోవడమే సరిపోతోంది. ఎందుకంటే.. ఈ మూడేళ్ల క్యూట్ కిడ్ కి సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ ఏ స్టార్ హీరోకన్నా తక్కువేం కాదు . అంత సూపర్ ఫాలోయింగ్ ని సంపాదించున్నాడు ఈ సెలబ్రిటీ కిడ్. ఈ మూడేళ్ల చిన్నారిని ఫుల్ టైమ్ చూసుకుంటూ తెగ ముచ్చటపడిపోతోంది కరీనా.
ఖాళీ గా ఉండి కొడుకు చేత చిన్నిచిన్ని పనులు చేయిస్తున్న కరీనా.. తనకొడుకుతో కలిసి ఓ నెక్లెస్ తయారు చేసింది. ఇంట్లో ఉండే చిన్ని చిన్న థింగ్స్ తో తయారు చేసిన ఆ కలర్ ఫుల్ నెక్లెస్ ని మెడలో వేసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన ఆనందాన్ని, తనకొడుకు పనితనాన్ని తెగ చెప్పుకుంటోంది.
ప్రస్తుతం ముంబై స్కూల్లో చదువుకునన తైమూర్ కి చూస్కోడానికి నెలకు లక్షన్నర ఇచ్చి మెయిడ్ ని పెట్టుకున్నారు. అంతేకాదు లండన్ టాప్ స్కూల్లో చదించడానికి తయారీలు కూడా స్టార్ట్ చేశారు కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్. మరి నవాబుల బిడ్డా..మజాకానా అంటున్నారు ఫ్యాన్స్.