బాహుబలి సినిమా తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా అంటే నేషనల్ వైడ్ బజ్ క్రియేట్ అవుతోంది. సాహో తర్వాత ప్రభాస్ తన 20వ సినిమాను రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కొంతమేర జరిగింది. కరోనా ప్రభావంతో షూటింగ్ కు బ్రేక్ పడింది. అయితే.. సినిమాకు సంబంధించి టీమ్ నుంచి అప్డేట్ వస్తుందని భావించిన ఫ్యాన్స్ కు నిరాశ ఎదురైంది. దీంతో యూవీ క్రియేషన్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

 

మొన్న ఉగాది పండగకు ప్రభాస్ కొత్త స్టిల్, టైటిల్ తో అప్డేట్ వస్తుందని భావించారు. అసలు ప్రభాస్ పై ఎటువంటి ఫోటోషూట్ కూడా జరగలేదని తెలిసి ఫ్యాన్స్ రగిలిపోయి.. యూవీ క్రియేషన్స్ పై పరోక్ష యుద్ధం మొదలు పెట్టారు. యూవీ క్రియేషన్స్ పై సోషల్ మీడియాలో తమ ఆక్రోశాన్ని వ్యక్తం చేశారు. #banuvcreations హ్యాష్ ట్యాగ్ ను ట్విట్టర్ లో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ హ్యాష్ ట్యాగ్ జాతీయస్థాయిలో టాప్ ట్రెండింగ్ లో ఉంది.

IHG

 

ఫ్యాన్స్ నుంచి వచ్చిన వ్యతిరేకతను గుర్తించిన యూవీ క్రియేషన్స్ వెంటనే ట్విట్టర్ లో స్పందించింది. ‘కరోనా పరిస్థితుల వల్ల ప్రభాస్ 20వ సినిమా గురించి ఎటువంటి అప్డేట్స్ ఇవ్వలేకపోతున్నాం. ఫ్యాన్స్ అందరూ సంయమనం పాటించండి. మీకోసం ఎన్నో అప్డేట్స్ సిద్ధంగా ఉన్నాయి. అందరూ ఇళ్లలో ఉండండి.. క్షేమంగా ఉండండి’ అని ట్వీట్ చేసింది. మరి దీనిపై ప్రభాస్ ఫ్యాన్స్ స్పందనేంటో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: