మంచు మనోజ్...డైలాగ్ కింగ్ మోహన్బాబు కుమారుడు. ఇంటి పేరులో మంచు ఉందే తప్ప, మాటలో మాత్రం ఫైర్. తాజాగా మంచు మనోజ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓరే ఇడియట్స్ లారా...అంటూ మొదలు పెట్టిన ట్వీట్ హాట్ హాట్గా కొనసాగింది. దీనికంతటికి కారణం కరోనానే. కరోనాపై యుద్ధం చేస్తున్న తరుణంలో ప్రధాని మోడీ ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు దీపాలు లేదా కొవ్వొత్తులు...సెల్ఫోన్లో లైట్ అయినా ఆన్ చేయాలని కోరారు. ప్రధాని సూచించిన మేరకు ఎవరికి తోచినట్టు వాళ్లు దీపాలు వెలిగించారు. దీపం వెలిగించి దేశ ఐక్యత చాటమని ప్రధాని మోడీ పిలుపుని ఇస్తే.. కొంతమంది దీపాలకు బదులు కొంపలు తగలెట్టడానికి రెడీ అయ్యారు. దీపాలకు బదులుగా భారీ శబ్ధాలతో బాణాసంచా కాల్చుతూ అత్సుత్సాహం చూపించారు.
కొంతమంది అయితే రోడ్లపైకి వచ్చి పెద్ద పెద్ద మంటలు వేస్తూ క్రాకర్స్ కాల్చి హంగామా చేశారు. కొన్నిచోట్ల ఈ క్రాకర్స్ వల్ల భారీ అగ్ని ప్రమాదాలు కూడా జరిగాయి అంటే వీళ్ల పైత్యం ఏం రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓ పక్క జనం చిచ్చిపోతూ ఉంటే బాణాసంచా కాల్చుకుంటూ సంబరాలు ఏంటి?? అసలు ప్రధాని చెప్పింది ఏంటి? వీల్లు చేస్తుంది ఏంటి అంటూ ట్విట్టర్లో ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు. నిజానికి ప్రధాని ఓ మంచి ఉద్దేశంతో ఈ దీపాలు వెలిగించే కార్యక్రమానికి పిలుపునిచ్చినప్పటికీ కొంతమంది క్రాకర్స్ కాల్చి నానా రచ్చ చేయడంతో విమర్శలకు తావిస్తోంది. అలాంటి వాళ్లను సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేస్తూ గడ్డి పెడుతున్నారు. హీరో మంచు మనోజ్ కూడా అలాంటి వాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్స్ చేశాడు. ఆ ట్వీట్స్ కాస్తా హాట్గా ఉండటంతో బాగా పేలాయి.
‘ఓరే ఇడియట్స్ లారా.. క్రాకర్స్ కాల్చడం ఆపండిరా. అలా కాల్చమని ఎవరూ అడగలేదురా. పాండిత్యం ఎక్కువైన జి బలిసిన వారే ఇలా చేస్తున్నారు. దయచేసి గమనించండి. మనం మనుషులం.. మూర్ఖులం కాదు. ఈ క్రాకర్స్ చూస్తుంటే మనవాళ్లు కరోనాని కూడా సీఎం లేదంటే పీఎం చేసేస్తారనుకుంటా.. ఓరి __ బతుకు. మళ్లీ జై కరోనా అంట’ అంటూ తన మంచు మనోజ్ చిటపటలాడాడు. క్రాకర్స్లా పేలుతున్న మంచు ట్వీట్స్కు నెటిజన్ల నుంచి మద్దతు లభిస్తుండడం విశేషం.
Idiots stop bursting crackers 🙏🏻 no one asked u too ... I’m sure only G balisina educated lot r doing this .... please guys 🙏🏻 let’s be humans and not morons 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
— MM*🙏🏻❤️ (@HeroManoj1) April 5, 2020