తెలుగు సినిమా రంగంలో జగపతి బాబుపై అదే విధంగా దివంగత సౌందర్య పై అనేక రూమర్లు రావడం జరిగాయి. ఇద్దరు నటించిన సినిమాలు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ లో అనేక సూపర్ డూపర్ హిట్ విజయాలు సాధించాయి. మంచి హిట్ పెయిర్ గా పేరు సంపాదించిన ఈ జంటపై అనేకమైన వార్తలు రూమర్లు ఎప్పటినుండో ఉన్నాయి. కాగా సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయి చాలా సంవత్సరాలు అయ్యింది. ప్రస్తుతం జగపతిబాబు కూడా హీరోగా కాకుండా క్యారెక్టర్ సపోర్ట్ పాత్రలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు జగపతిబాబు మీడియా కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో దాదాపు సౌందర్య గురించి ప్రశ్న కచ్చితంగా ఉండే ఉంటుంది.

 

అయితే చనిపోయిన సౌందర్య గురించి తన గురించి వస్తున్న వార్తలలో ముఖ్యంగా ఎఫైర్ ఉందన్న వార్తల గురించి ఇటీవల జగపతిబాబు తనదైన శైలిలో స్పందించాడు. సౌందర్య గురించి ఇటీవల ఓ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో జగపతి బాబు స్పందిస్తూ...సౌందర్య తో తనకి ఉన్న రిలేషన్ షిప్ గురించి చాలామంది ఫిజికల్ గా అర్థం చేసుకుంటారని, కానీ సౌందర్య తో ఉన్న అనుబంధం ప్రత్యేకమైనదని, దానికి అస‌లైన అర్థం ఎవ్వ‌రికీ తెలీద‌ని చెప్పుకొచ్చాడు జ‌గ్గూభాయ్‌.

 

సౌంద‌ర్య కుటుంబ స‌భ్యులు కూడా త‌న‌తో ఆత్మీయంగా ఉండేవార‌ని..వాళ్ల కజిన్ బ్రదర్ నాకు ఫ్రెండ్ అని ఆ చనువుతో ఇంటికి వెళ్ళే వాడిని దానిలో తప్పేం లేదని చెప్పుకొచ్చాడు. అసలు లేని వ్యక్తి గురించి పర్సనల్ విషయాలు మాట్లాడడం సరైన మేనర్ కాదని గట్టిగా జగపతిబాబు సదరు యాంకర్ కి సూచించాడు. ఇదే తరుణంలో సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా చనిపోయిన సౌందర్య ఎఫైర్ల గురించి జనానికి అవసరమా, పద్ధతి లేని ప్రశ్నలు అంటూ సదరు ఛానల్ పై మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: