శ్రీ‌రెడ్డి.. ప్ర‌స్తుతం ఈ పేరు తెలియ‌ని వారు తెలుగు రాష్ట్రాల్లో ఎవ్వ‌రూ ఉండ‌రు. క్యాస్టింగ్ కౌచ్ వివాదంతో టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసింది ఈ భామ‌. 'మా' అసోసియేషన్ లో శివాజీరాజా త‌నకు స‌భ్య‌త్వం ఇవ్వ‌లేదంటూ నానా హంగామా చేసి అర్థ‌న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న‌తో దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం సృష్టించింది. క్యాస్టింగ్ కౌచ్, మీటూ అంటూ టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టించింది శ్రీరెడ్డి. దగ్గుబాటి అభిరామ్, నాని వంటి వారిపై ఆరోపణలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. పవన్ కళ్యాణ్‌పై అసభ్యకర మాటలు వదలడం, ధూషించడంతో కథ అంతా మారిపోయింది. దీంతో దెబ్బకు మూటాముళ్ల సర్దుకుని కోలీవుడ్‌కు చెక్కేసింది. అయితే మధ్యలో కొన్ని రోజలు సైలెంట్‌గా ఉన్న శ్రీ రెడ్డి.. మళ్లీ పుంజుకుంది నోటికి పని చెబుతోంది. కోలీవుడ్‌లో సెటిలైన శ్రీ రెడ్డి.. అడపాదడపా ఆఫర్లు దక్కించుకుంటూ తన పని తాను చేసుకుంటూ పోతోంది. యూట్యూబ్‌లో వంటల ప్రోగ్రామ్ చేసుకుంటూ వివాదాలకు దూరంగా ఉండసాగింది. అయితే ఆ మధ్య చిరంజీవి, రీసెంట్‌గా రాకేష్ మాస్టర్ శ్రీ రెడ్డి గురించి ప్రస్తావించడంతో మరింత రెచ్చిపోయింది.

 

అయితే పవన్ కళ్యాణ్, చిరంజీవిపై శ్రీరెడ్డి ఎన్ని కామెంట్స్ చేసినా, ఎంతటి పదజాలాన్ని వాడినా.. వారెప్పుడు శ్రీరెడ్డి గురించి ప్రత్యక్షంగా ప్రస్తావించలేదు. ఈ మధ్య జనసేన ఆవిర్భావసభలోనూ శ్రీరెడ్డిని పరోక్షంగానే ప్రస్థావించాడు పవన్ కళ్యాణ్. ఆ సమయంలోనూ శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేసింది. ‘పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడు కావడం వల్ల పగ తీర్చుకోవడం లేదేమో గానీ.. లెజెండ్ అయిన చిరంజీవి మాత్రం నా మీద పగ తీర్చుకుంటున్నాడు.. ఇదంతా ఫ్యామిలీ డ్రామా' అంటూ సెన్సేషనల్ పోస్ట్ చేసింది శ్రీ రెడ్డి. ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడాలి అంటేనే ఆచితూచి పదం పదం సమకూర్చుకుని మరీ మాట్లాడుంటారు చాలామంది. కాని శ్రీరెడ్డికి ఆ ఫ్యామిలీతో జరిగిన అన్యాయం ఏంటో తెలియదు కాని, ఎప్పుడు ఎక్కడ ఎవరు ఎందుకు ఎలా మాట్లాడినా ఆ ఫ్యామిలీని టార్గెట్ చేయడానికి నునున్నానంటూ ముందుకు వస్తుంటుంది శ్రీరెడ్డి. 

మరింత సమాచారం తెలుసుకోండి: