ప్రస్తుతం ఈ కరోనా వ్యాధి భయంతో మన దేశాంతో పాటు చాలా దేశాలు ఇప్పటికే పూర్తిగా ప్రజలను ఇళ్లకు పరిమితం చేస్తూ లాకౌట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అలానే మనదేశాన్ని ఏకంగా 21 రోజులు లాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీ, ప్రజలు ఈ సమాయంలో ఎంతో జాగ్రత్తగా ఉండి, సోషల్ డిస్టన్సింగ్ తప్పనిసరిగా పాటించాలని ప్రజలను కోరడం జరిగింది. దానితో కార్యాలయాలు, ఆఫీసులు, వ్యాపార సమూహాలు, స్కూళ్లు, కాలేజీలు, సహా మొత్తం అన్ని రంగాలు మూతపడడం, తద్వారా దేశం కొంత ఆర్ధిక మాంద్య సమస్యను ఎదుర్కొంటోంది. 

 

అయినప్పటికీ కూడా ప్రజల ఆరోగ్య రక్షణే తమకు ముఖ్యం అని, లాకౌట్ చేస్తున్న ఈ సమయంలో దిగువ తరగతుల వారు ఎటువంటి సమస్యలు ఎదుర్కోకుండా ఇప్పటికే వారికి కొంత ఆర్ధిక భరోసాని ప్రభుత్వం కల్పించడం జరిగింది. ఇకపొతే ఈ లాకౌట్ వలన షూటింగ్స్ కూడా నిలిపివేయబడడంతో పలువురు స్టార్స్ సహా మొత్తం ఇండస్ట్రీ ప్రముఖులు తమ ఇళ్లకు పరిమితం అయి, మధ్యలో ప్రజలకు కరోనా పట్ల ఎవరికి వారు తమకు వీలైనంతగా అవగాహన కలిగిస్తున్నారు. ఇకపోతే ఇప్పటికే తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కరోనా గురించి ప్రజలను ఎప్పటికప్పుడు జాగ్రత్తగా తమ ఇంటి వద్దనే ఉండండి అంటూ హెచ్చరిస్తున్న టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, నిన్న సాయంత్రం తన ట్విట్టర్ లో పెట్టిన ఒక పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది. 

 

మూడు చింపాంజీలు కలిసి కూర్చుని మన మనుషుల గురించి ఈ విధంగా మాట్లాడుకుంటున్నాయని, ఈ మనుషులు 2020లో ఏకంగా అంగారక గ్రాహం పై కాలుమోపుతాం అని బిల్డప్ ఇచ్చారు, కానీ తీరా ప్రస్తుత పరిస్థితి చూస్తే, ఆఖరికి ఎవరికి వారు తమ ఇళ్ల నుండి బయటకు కూడా రాలేని పరిస్థితులు వచ్చాయనే పోస్టర్ పోస్ట్ చేసారు. అయితే ప్రస్తుతం మనం నిజంగానే అటువంటి పరిస్థితుల్లో ఉన్నాం అని, అతి త్వరలో తప్పకుండా ఈ కరోనా మహమ్మారి నుండి సురక్షితంగా బయటపడతాం అని పలువురు నెటిజన్లు ఆయన పోస్ట్ పై కామెంట్స్ చేస్తున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: