అక్కినేని కుటుంబంలోని మూడో తరం వారసుడు హీరో అక్కినేని అఖిల్ పుట్టినరోజు నేడు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పుట్టినరోజు వేడుకలు వంటివి చేయవద్దని, అందరూ ఇంట్లోనే ఉండి క్షేమంగా ఉండాలని అక్కినేని అఖిల్ కోరారు. పుట్టినరోజు జరుపుకునే సందర్భంలో మనం లేమని, అందుకే ఎవ్వరూ తన పుట్టినరోజు వేడుకలను నిర్వహించవద్దని అభిమానులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా అఖిల్ తన అభిమానులను ఉద్దేశించి సోషల్ మీడియా వేదికిగా ఒక మెసేజ్ చేసాడు. 

 

'అందరికీ హాయ్. బాగున్నారా... మీతో ఇలా మాట్లాడి చాలా రోజులు అవుతుంది. నేను ఈ వీడియో ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే రేపు (ఏప్రిల్ 8) నా పుట్టినరోజు. పుట్టినరోజు అనగానే అభిమానులందరూ సెలబ్రేషన్స్ చేస్తుంటారు. కేక్ కటింగ్స్ చేస్తుంటారు. కానీ ఈసారి ఎవ్వరూ అలా చేయకండి. ఈ సమయంలో అవి కరెక్ట్ కాదు. దయచేసి అందరూ ఇంట్లోనే ఉండండి. క్షేమంగా ఉండండి. రేపు (ఏప్రిల్ 8) ఏ పోస్టర్ కానీ, టీజర్ కానీ విడుదల చేయడం లేదు. ఇది నా బాధ్యతగా భావిస్తూ నేను ఏమీ రిలీజ్ చేయడం లేదు. నిర్మాత, దర్శకుడు అడిగినా కూడా వద్దని చెప్పాను. ఈ విషయం మీకు చెబుదామనే ఇలా వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. మీ ధైర్యంతోనే, మీ బలంతోనే సినిమాలు చేస్తుంటాం. కానీ ఆ బలం, ఆ ధైర్యం ఇప్పుడు మీ కుటుంబాలకు అవసరం. వాళ్లతోనే ఉండండి. క్షేమంగా, ధైర్యంగా ఉండండి. రేపు నేను మీ అందరికోసం మా ఫ్యామిలీతో దిగిన ఓ ఫొటో పోస్ట్ చేయబోతున్నాను. మీరు కూడా మీ ఫ్యామిలీతో హ్యాపీ ఫొటో తీసుకోండి. నాకోసం పోస్ట్ చేయండి. ఇండియా కోసం.. ప్రపంచం కోసం.. ఈ కరోనా-కోవిడ్ 19పై అందరం కలిసి ఫైట్ చేద్దాం. అందరికీ ధన్యవాదాలు' అని అఖిల్ ఈ వీడియోలో తెలిపారు.

 

ప్రస్తుతం అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో 'మోస్ట్ ఎలిజిబుల్ బాచ్యులర్' సినిమా చేస్తున్నాడు. అఖిల్ సరసన ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. వ‌రుస‌ పెట్టి బ్లాక్ బ‌స్ట‌ర్స్ ని అందిస్తున్న ప్రొడ‌క్ష‌న్ హౌస్ గా పేరు సంపాదించిన జీఏ2 పిక్చ‌ర్స్ ప‌తాకం పై తెర‌కెక్కుతుండ‌టంతో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్’ పై భారీగా అంచ‌నాలు నెల‌కొన్నాయి. మరి భాస్కర్ తో చెయ్యబోయే సినిమాతోనైనా అఖిల్ భారీ విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: