ఈ ఏడాది సంక్రాంతి కానుకగా అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ హీరోగా వచ్చిన చిత్రం అల వైకుంఠపురములో. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమా తర్వాత ఈ సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా హిట్ అవ్వాలని మెగా అభిమానులు కూడా కోరుకున్నారు. ఎక్కువ సమయం తీసుకుని మరీ ఈ సినిమా చేసాడు అల్లు అర్జున్. ఇక వసూళ్ళ పరంగా కూడా ఈ సినిమా చాలా మంచి విజయం సాధించింది. త్రివిక్రమ్ కూడా ఈ సినిమా ఫలితం చూసి షాక్ అయ్యాడు; 

 

ఇక బాలీవుడ్ కూడా ఈ సినిమా మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. బాలీవుడ్ హీరోలు కూడా ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చెయ్యాలని భావించి త్రివిక్రమ్ తో నిర్మాత అల్లు అరవింద్ తో చర్చలు కూడా జరిపిన సంగతి తెలిసిందే. అయితే అల్లు అరవింద్ మాత్రం ఈ సినిమాను తన కొడుకుతోనే బాలీవుడ్ లో నిర్మించాడు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ ఆలోచన పూర్తిగా మారిపోయింది అంటున్నారు. అల్లు అర్జున్సినిమా తర్వాత కమర్షియల్ గా ఆలోచించడం మొదలుపెట్టాడు. ఎక్కువ పారితోషికం తో పాటుగా... 

 

భారీ బడ్జెట్ సినిమాలు చెయ్యాలి అనే ఆలోచనకు అల్లు అర్జున్ వెళ్ళిపోయాడు. అందుకే ఈ సినిమా తర్వాత కమర్షియల్ దర్శకుడు అయిన సుకుమార్ తోనే సినిమా చేయడానికి అంగీకరించాడు. అల్లు అర్జున్ తో సినిమా చెయ్యాలి అనుకునే నిర్మాతలు దర్శకులు కూడా అదే విషయాన్ని చెప్పారు. అల్లు అర్జున్ తో సినిమా చెయ్యాలి అనుకునే దర్శకులు అయితే కథ లో కొంచెం పట్టున్నా సరే బన్నీ నెట్టుకొచ్చే అవకాశం ఉంటుంది అని భావించి అతని తో సినిమాలు చెయ్యాలి అనుకోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: