టాలీవుడ్ లో ఇప్పుడు సినిమాలకు మార్కెట్ ఎక్కువగా పెరుగుతున్న నేపధ్యంలో హీరోలు ఎక్కువగా నిర్మాతలు గా మారే ప్రయత్నాలు చేస్తున్నారు. కథ బాగుంటే సినిమాలు నిర్మించడానికి ముందుకి వస్తున్నారు హీరోలు. ఏ హీరో అయినా సరే ఇదే ఆలోచన చేస్తున్నాడు. టాలీవుడ్ లో ఇప్పుడు కమర్షియల్ సినిమాల హవా ఎక్కువగా పెరిగిన సంగతి తెలిసిందే. ప్రతీ చిన్న విషయాన్ని హీరోలు చాలా జాగ్రత్తగా తీసుకుని సినిమాలను నిర్మిస్తున్నారు. దర్శకులు కూడా ఇప్పుడు అదే ప్రయత్నాలు చేస్తున్నారు. కథ విషయంలో ఒకటికి వంద సార్లు ఆలోచిస్తున్నారు. 

 

ఇక ఇది పక్కన పెడితే అల్లు అర్జున్ ఇప్పుడు నిర్మాతగా మారే ఆలోచనలో ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. కథ బాగుంది అనుకుంటే అతను సినిమా నిర్మించడానికి రెడీ గా ఉన్నాడని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. తన తండ్రి తో కలిసి మెగా హీరో తో ఒక సినిమా చేయడానికి అతను రెడీ గా ఉన్నాడని టాలీవుడ్ లో ఇప్పుడు వార్తలు వినపడుతున్నాయి. కథ విషయంలో ఒక దర్శకుడికి ఇప్పటికే పని అప్పగించారని కథ నచ్చితే మాత్రం సినిమాను త్వరలోనే మొదలు పెట్టే అవకాశం ఉందని సమాచారం. 

 

ఇప్పటికే కథ పూర్తిగా రెడీ అయిందని అయితే కొన్ని కొన్ని మార్పులు ఉండటం తో సినిమాను వాయిదా వేసారని టాలీవుడ్ లో వార్తలు వినపడుతున్నాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మంధనా ను తీసుకునే అవకాశాలు ఉన్నాయి అనే ప్రచారం కూడా ఎక్కువగానే జరుగుతుంది. ఆమె కూడా అందుకు ఓకే చెప్పింది అని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని అయితే హీరో విషయంలో కాస్త జాగ్రత్తగా ఆలోచించే ప్రయత్నం చేస్తున్నారట. హీరో పారితోషకం  ఎక్కువ అడిగితే మాత్రం సినిమాను పక్కన పెట్టే ఆలోచనలో ఉన్నారట. మరి ఇది ఎంత వరకు నిజమో.

మరింత సమాచారం తెలుసుకోండి: