నేడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్  బర్త్ డే సందర్బంగా అయన ఫ్యాన్స్ కు సప్రైజ్ ల మీద సప్రైజ్ లు ఇస్తుంది మైత్రి మూవీ మేకర్స్. బన్ని తన 20 వ చిత్రాన్నిస్టార్ డైరెక్టర్ సుకుమార్ తో చేయనున్నాడని తెలిసిందే. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్  నిర్మిస్తుంది. ఈరోజు ఈ సినిమా ఫస్ట్ లుక్ తోపాటు టైటిల్ ను  విడుదలచేశారు. ఈ చిత్రానికి పుష్ప అనే టైటిల్ ను పెట్టారు. ఇంకో విశేషం ఏంటంటే ఇది పాన్ ఇండియా సినిమాగా విడుదలకానుంది. అందులో భాగంగా తెలుగు తోపాటు కన్నడ ,మలయాళ, తమిళ్ ,హిందీ లో విడుదలకానుంది. అన్ని భాషల్లో అదే టైటిల్ తో రానుంది. ఇక  ఫస్ట్ లుక్ మాత్రం అదరగొట్టింది. మొదట విడుదల చేసిన పోస్టర్ లో కోపంగా  చూస్తూ కనిపించిన  అల్లు అర్జున్  రెండవ పోస్టర్ లో పోలీసులకు దొరికిపోయి కింద కూర్చొని కనిపించాడు. ఈ రెండు పోస్టర్ లకు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. 
 
 
ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం జూన్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఈ చిత్రంలో బన్ని చిత్తూరు యాసలో మాట్లాడనుండగా ఆయనకు జోడిగా కన్నడ బ్యూటీ రష్మిక కథానాయికగా నటించనుంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం  ప్రేక్షకులముందుకు రానుంది. కాగా అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్ లో ఇది మూడో సినిమా. ఇంతకుముందు వీరికాంబో లో ఆర్య సిరీస్  తెరకెక్కింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: