తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘హ్యాపీడేస్’ మూవీతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది తమన్నా.  ఆ తర్వాత నాగ చైనత్యతో 100%లవ్ మూవీతో మంచి పేరు తెచ్చుకుంది.  తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించిన తమన్నా వరుసగా ఛాన్సులు దక్కించుకున్నా పేరు మాత్రం పెద్దగా సంపాదించుకోలేక పోయింది.  బాహుబలి లో అప్సరసలా కనిపించి ఈ చిన్నది తర్వాత బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.. కానీ అక్కడ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.  దాంతో దక్షిణాదివైపు చూపు మరల్చింది.  ఆ మద్య అనీల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ నటించిన ‘ఎఫ్ 2’ మూవీలో నటించింది.  

 

నాజూకుదనానికి నమూనా అంటూ ప్రశంసలు అందుకుంది. అయితే కొత్త కథానాయికల ఎంట్రీ వలన ఇటీవల కాలంలో ఆమెకి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. పెరిగిన ఆమె పారితోషికం మరో కారణమని అనేవారు లేకపోలేదు. తాజాగా తమన్నాపై ఈ మద్య కొన్ని రూమర్లు పుట్టుకొస్తున్న విషయం తెలిసందే.  ఈ నేపథ్యంలోనే తమన్నా పనైపోయిందనీ, ఎటు వైపు నుంచి చూసినా ఆమెకు పెద్దగా అవకాశాలు లేవనే వార్తలు షికారు చేస్తున్నాయి.తను ఖాళీగానే వున్నానంటూ జరుగుతున్న ఈ ప్రచారం పట్ల తమన్నా స్పందిస్తూ .. నేను 365 రోజులు బిజీగానే వున్నాను .. వరుసగా ప్రాజెక్టులు వస్తూనే వున్నాయి. నాకు నచ్చిన పాత్రలను నేను ఎంచుకుంటూనే వున్నాను.

 

 ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం ఎంతగా ఉందో అందరికీ తెలిసిందే. ఈ సమయంలో అందరూ షూటింగ్ బంద్ చేసి ఇంటికే పరిమితం అయ్యారు.  ఈ సమయంలో కూడా లేని పోని పుకార్లు పుట్టించడం ఎంత వరకు న్యాయం అని అడుగుతుంది. ప్రస్తుతం నేను చేస్తున్న 'సీటీమార్' షూటింగు దశలో వుంది. ఈ సినిమాలోని పాత్ర కోసం నేను కబడ్డీ నేర్చుకున్నాను. నా ప్లానింగ్ ప్రకారం నేను ముందుకు వెళుతున్నాను. నేను ఖాళీగా వున్నానని ప్రచారం చేసేవారే ఖాళీగా వున్నారని నాకు అర్థమవుతోంది అని చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: