మహర్షి లాంటి సూపర్ హిట్ సినిమా తో జోష్ మీదున్న పైడిపల్లి వంశీ... అదే జోష్ తో  అదే హీరో తో మరోసారి సినిమా తీసి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవాలని అనుకున్నారు. సరిలేరు నీకెవ్వరూ  సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్న మహేష్ సినిమా తీసేందుకు స్క్రిప్ట్ కూడా రెడీ చేసి చేసుకున్నారు. ఇక అంతే ఓకే అయింది ఇంకొద్ది రోజుల్లో మహేష్ బాబు వంశీ పైడిపల్లి సినిమా పట్టలెక్కబోతుంది  అనుకుంటున్న తరుణంలో ... కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు కాస్త ఆగిపోయింది. మహేష్ బాబు వంశీ పైడిపల్లి కథ కాస్త నచ్చకపోవడంతో... వంశీ పైడిపల్లి తో సినిమాను కాస్త పక్కకు పెట్టేసాడు సూపర్ స్టార్ మహేష్ గారు. ఈ క్రమంలో అటు వంశీ పైడిపల్లి కూడా కాస్త హర్ట్ అయ్యాడు.

 

 

 ప్రస్తుతం మహేష్ బాబు  తదుపరి సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడు. అయితే మహేష్ బాబుతో సినిమా తీసే ఛాన్స్ కాస్త పక్కకు పోయింది అని బాధ పడకుండా వంశీపైడిపల్లి మరో స్టార్ హీరో ని లైన్ లో పెట్టేందుకు  సిద్ధమయ్యాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పై వంశీ పైడిపల్లి దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ అనే సినిమాతో బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.  ఆర్.ఆర్.ఆర్ లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత రామ్ చరణ్డైరెక్టర్ తో  సినిమా తీయబోతున్నాడు అనేది ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. 

 

 

 తన తర్వాత సినిమా ఏ దర్శకుడితో చేయాలి అనే దానిపై మెగా పవర్ స్టార్ రాంచరణ్ నిర్ణయానికి రాలేదు. దీంతో  రాంచరణ్ ను  సెట్ చేయాలని ప్రయత్నం లో ఉన్నాడట  వంశీ పైడిపల్లి. దీని కోసం ప్రయత్నాలు కూడా మొదలు పెట్టాడట. వంశీ పైడిపల్లి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వచ్చిన ఎవడు సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. చూడాలి మరి వంశీ పైడిపల్లి కనీసం ఈ హీరో నైనా సెట్ చేస్తాడా లేదా అన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: