బాలీవుడ్ లో అమితాబచ్చన్ తర్వాత ఆ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నటులు సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, అమీర్ ఖాన్. అయితే సల్మాన్ ఖాన్ - షారూఖ్ ఖాన్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ షేక్ చేశాయి. జాతీయస్థాయి హీరోలుగా సల్మాన్, షారుక్ లకు వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. హీమాన్ గా సల్మాన్ , రోమాంటిక్ కింగ్ గా షారుక్ ప్రేక్షకుల హృదయాలపై బలమైన ముద్రను వేశారు. ఈ అగ్రహీరోల సినిమాలు ఈ మధ్య కాలంలో అంచనాలను అందుకోలేక పోయాయి. ఆయా సినిమాల ప్రమోషన్స్ విషయంలో ఇద్దరూ ఎన్ని ప్రయత్నాలు చేసినా, పెద్దగా ప్రయోజనం కనిపించలేదు. వీరిద్దరి కాంబినేషన్లో ఓ మూవీ నిర్మించేందుకు నిర్మాత నిఖిల్ ద్వివేది సన్నాహాలు చేస్తున్నారట.
గతంలో ఈ ఖాన్ల ద్వయం నటించిన కరన్ అర్జున్, హమ్ తుమ్హారే హై సనమ్, కుచ్ కుత్ హోతా హై వంటి తదితర మూవీలు విశేష ప్రేక్షకాదరణతో బాలీవుడ్లో బ్లాక్ బస్టర్లు గా నిలిచాయి. గతంలో వీరి మద్య కొన్ని అభిప్రాయ భేదాలు రావడంతో విడిపోయారని ఎన్నో వార్తల్లో వచ్చాయి. అయితే వీరిద్దరు కలిసిన ప్రతి కార్యక్రమంలోనూ తమపై వస్తున్నవన్నీ ఒట్టి రూమర్లే అని తమ మద్య ఎప్పటికే స్నేహబంధం చెడిపోదనని అంటూ క్లారిటీ ఇస్తున్నారు. అయితే వీరి కాంబినేషన్ లో మరోసారి ఫుల్ లెన్త్ మూవీ కోసం బాలీవుడ్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఈ మధ్య కాలంలో అంచనాలను అందుకోలేకపోయాయి. ఆయా సినిమాల ప్రమోషన్స్ విషయంలో ఇద్దరూ ఎన్ని ప్రయత్నాలు చేసినా, పెద్దగా ప్రయోజనం కనిపించలేదు. దాంతో ఇద్దరూ ఆలోచనలో పడ్డారు. మొత్తానికి ఈ ఇద్దరు కథానాయకులతో దర్శకుడు నిఖిల్ అద్వాని ఒక భారీ మల్టీస్టారర్ ను ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. యశ్ రాజ్ ఫిలిమ్స్ వారు ఈ సినిమాను నిర్మించడానికి ముందుకు వచ్చినట్టుగా చెబుతున్నారు.