అరవైఏళ్ళు వచ్చినా మెగాస్టార్ పక్కన నటించమంటే ఇప్పటికీ హీరోయిన్లకు అదో క్రేజ్. అయితే ప్రస్తుతం మారిన పరిస్థితుల నేపధ్యంలో చిరంజీవి సరసన త్రిష, నయనతార, అనుష్క వంటి యాక్ట్రస్నే ఎంపిక చేస్తున్నారు కానీ ఒకప్పుడు ప్రతీ హీరోయిన్ ఆయన సరసన నటించి రెమ్యూనరేషన్ని పెంచేసుకున్నవారే అని చెప్పాలి. అయితే తాము సినిమాలు చేస్తున్న నేపధ్యంలో నలుగురు హీరోయిన్లు మాత్రం చిరంజీవితో అస్సలు నటించలేదు. అలాగని వారేం ఒకటి, రెండు సినిమాలు చేసి ఇండస్ట్రీకి దూరం కాలేదు. ఆ మాటకొస్తే వారిలో ముగ్గురూ ఇప్పటికీ తెర పైన కనిపిస్తున్నవారే. వారిలో మొదటిగా చెప్పుకోవలసింది రజనీ గురించి. దర్శకరత్న బ్రహ్మముడి చిత్రం నుంచి తెలుగు తెరకు పరిచయమైన రజనీని చూసి అప్పట్లో జయప్రదలా రాధలా ఉందని అనేవారట. అయితే ఆమె మాత్రం ఎవ్వరికీ నకలుగా తయారవ్వకుండా దాదాపు 150 సినిమాల్లో హీరోయిన్గా చేసింది. కృష్ణ, శోభన్బాబు, నాగార్జున, వెంకటేష్, అర్జున్, రాజశేఖర్, రాజేంద్రప్రసాద్, చంద్రమోహన్, మోహన్బాబు, నరేష్, సుమన్ ఇలా అందరి హీరోల సరసన నటించి మెప్పించింది. అయితే ఒక్క మెగాస్టార్ చిరంజీవి సరసన మాత్రం నటించలేదు. దీనికి కారణం చెపుతూ ఆమె ఒకటి రెండు సార్లు ఆఫర్ వచ్చినాకూడా ఇండస్ట్రీలోని లాబియింగ్ తోనే ఛాన్స్ మిస్ అయినట్లు తెలిపింది. దీనికోసం తనని కొన్ని పేపర్లు అడిగారని అవి చేయనందుకే తన పై పగతోనే సదరు అవకాశాలు నాశనం చేసినట్లు ఆమె చెపుతుంది.
అదే సమయంలో అశ్విని కూడా మంచి పేరు తెచ్చుకుంది. మాస్ క్యారెక్టర్లలతో పాటు కుటుంబ కథా చిత్రాలలో నటించిన ఆమె చాలా చిన్న వయసులోనే గుండె జబ్బుతో చనిపోయింది. ఈమె కూడా తెలుగులో కృష్ణ, బాలకృష్ణ, నరేష్, రాజశేఖర్, రాజేంద్రప్రసాద్ సరసన నటించింది. బాలయ్యబాబుతో భానుమతిగారి మొగుడు చిత్రంలో చేస్తున్నప్పుడు ఆమెకు చిరంజీవితో నటించే ఛాన్స్ వచ్చినా అది చేజారిపోయిందంటారు. 1989లో ఆఖరిక్షణం అనే సినిమా ఆమెకు చివరి సినిమా. ఆ తర్వాత టీవీ సీరియల్స్లో నటిస్తూ ఉండగా 2012లో హార్ట్ ఎటాక్తో చనిపోయింది.
ఇక మూడో హీరోయిన్ 1990లో సినిమా రంగంలోకి వచ్చిన ఆమని మంజు పేరుతో ఒకటి రెండు సినిమాలు చేసిన ఆమని తెలుగులో టాప్స్టార్లందరి సరసన నటించింది. మెగాస్టార్ చిరంజీవితో సినిమా వచ్చినట్లే వచ్చి చేజారిపోయిందని ఇప్పటికీ బాధపడుతుందామె. సౌందర్యతో కలిసి నటిస్తున్న చిత్రంలో అవకాశం వచ్చినా ఎందుకో నిర్మాతలు తనను తొలగించారంటూ తెలిపింది. ఇక సౌందర్య చిరంజీవితో కలిసి నటించిన చిత్రాలు చూస్తే రిక్షావోడు, మంజునాధ, చూడాలని ఉంది.
ఇదే తరహాలో మెగాస్టార్తో నటించలేకపోయిన హీరోయిన్ ఇంద్రజ.ఈమె కూడా టాలీవుడ్ లో అగ్ర హీరోలందరి సరసన నటించి మెప్పించింది. పెద్దన్నయ్య చిత్రం తర్వాత చిరంజీవి సరసన నటించే అవకాశం దక్కలేదు. ఎక్కువగా చిన్న హీరోలతో నటించేది. దాంతో పెద్దగా మెగాస్టార్ సరసన నటించే అవకాశం దక్కలేదు.