అక్కినేని ఫ్యామిలీ వారి మూడవతరం వారసుడైన అఖిల్ అక్కినేని, నేడు తన 26వ పుట్టినరోజుని జరుపుకుంటున్న విషయం తెలిసిందే. చిన్నతనంలోనే తన తండ్రి నాగార్జున నటించిన సిసింద్రీ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన అఖిల్, ఆ తరువాత పెరిగి పెద్దయ్యాక, అక్కినేని ఫ్యామిలీ వారి మూడు తరాల నటులైన ఏఎన్నార్, నాగార్జున, నాగచైతన్య కలసి నటించిన మనం సినిమాలోని క్లైమాక్స్ సీన్ లో కొద్దీ క్షణాలు కనపడతారు. అయితే ఆ తరువాత పూర్తిగా స్థాయి హీరోగా మాత్రం మాస్ సినిమాల దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన అఖిల్ సినిమాతో ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అప్పట్లో ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. 

 

ఇక ఆ తరువాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన హలొ సినిమా కూడా అఖిల్ కి మంచి సక్సెస్ ని అందివ్వలేకపోయింది, ఆపై యువ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ మజ్ను కూడా కేవలం యావరేజ్ విజయాన్ని అందుకోవడం జరిగింది. ఇక ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటిస్తున్న అఖిల్, ఎలాగైనా ఆ సినిమాతో మంచి హిట్ కొట్టి ఫ్యాన్స్ ని ఖుషి చేయాలని చూస్తున్నారు. 

 

ఇకపోతే నేడు తన పుట్టినరోజుని చక్కగా తన ఫ్యామిలీ మెంబర్స్ మధ్యన, ముఖ్యంగా తల్లితండ్రులతో జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, అన్నిటికంటే ముఖ్యం కుటుంబం అని, ఈ ఆనందాన్ని మాటల్లో వ్యక్తపరచలేనని అఖిల్ కాసేపటి క్రితం తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేయగా, ఆ తరువాత ఆయన తల్లి అమల, అతడి ట్వీట్ ని హ్యాపీ బర్త్ డే డియరెస్ట్ అఖిల్ అంటూ రీట్వీట్ చేసారు. కాగా ప్రస్తుతం వారిద్దరి ట్వీట్స్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి......!! 

మరింత సమాచారం తెలుసుకోండి: