టాలీవుడ్ లో ఇప్పుడు ఎప్పుడు సినిమా వస్తుంది అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. సినిమాల విషయంలో ఎంతో ముందు చూపుతో ఉంటుంది టాలీవుడ్. అలాంటిది ఇప్పట్లో సినిమా షూటింగ్ కూడా మొదలయ్యే అవకాశం కనపడటం లేదు అనేది వాస్తవం. సినిమా వస్తుంది అంటే ఫాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. ఫాన్స్ కి సరైన సమయానికి సినిమా ఇవ్వాలి అనేది హీరోల ఆలోచన కూడా. అందుకోసం చాలా కష్టపడతారు. ఇతర భాషల్లో కూడా దాదాపుగా ఇలాగే ఉన్నా మన టాలీవుడ్ లో మాత్రం ఇది కాస్త ఎక్కువ అనేది వాస్తవం. 

 

ఇప్పుడు కరోనా కారణంగా సినిమాలు వాయిదా పడ్డాయి. కనీసం షూటింగ్ కి కూడా వెళ్ళే పరిస్థితి దాదాపుగా లేదు అనే చెప్పాలి. దీనితో సినిమా ఎప్పడు వస్తుంది అని అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే కరోనా తర్వాత మాత్రం చాలా మంది హీరోలు బిజీ అయిపోయారని అంటున్నారు. సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలైనా సరే వేగంగా సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నారని అర్ధమవుతుంది. వేగంగా సినిమాల ను పూర్తి చేసి ఈ లేట్ ని భర్తీ చెయ్యాలని చూస్తున్నారు. అందుకోసం ఇప్పటికే దర్శక నిర్మాతలకు కూడా వాళ్ళు సమాచారం ఇచ్చారని అంటున్నారు. 

 

కరోనా ప్రభావం తగ్గిన తర్వాత అగ్ర హీరోలు అందరూ దాదాపు మూడేళ్ళు బిజీ అయిపోయే అవకాశం ఉందని టాలీవుడ్ జనాల మాట. అందుకోసం ఇప్పటి నుంచే కథలను కూడా వాళ్ళు సిద్దం చేసుకుని పెట్టుకున్నట్టు తెలుస్తుంది. వచ్చే ఏడాది లో ఒక్కో హీరో ఎలా అయినా సరే రెండు సినిమాల ను విడుదల చేసే ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. మూడేళ్ళ పాటు ఏడాదికి రెండు సినిమాలు చేస్తే మంచిది అనే ఆలోచనలో నిర్మాతలు దర్శకులు ఉన్నారని టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: