కరోనా ఎఫెక్ట్ తో ఎక్కడి పనులు అక్కడ ఆగిపోవడంతో టాలీవుడ్ ఇండస్ట్రీ పనులు కూడ పూర్తిగా అగిపోయాయి. సినిమాల ప్రారంభోత్సవాలు ప్రెస్ మీట్స్ తో నిరంతరం హడావిడిగా ఉండే ఫిలింనగర్ పరిసరాలు ప్రస్తుతం బోసిపోయి కనిపిస్తున్నాయి. 


ఇలాంటి పరిస్థితులలో ఇండస్ట్రీ వర్గాలకు ముఖ్యంగా ప్రభాస్ లేటెస్ట్ మూవీని నిర్మిస్తున్న యూవీ క్రియేషన్స్ కు రాజమౌళి వల్ల ఊహించని తలనొప్పులు ఎదురయ్యాయి. దేశవ్యాప్తంగా నెలకొనివున్న పరిస్థితుల కారణంగా ఈ టైమ్ లో సినిమాల ప్రమోషన్ లు చేయకూడదని చాలామంది దర్శక నిర్మాతలు హీరోలు తమ సినిమాలకు సంబంధించి అప్ డేట్స్ ఏమి ఇవ్వకుండా కాలక్షేపం చేస్తున్నారు. 


ఇలాంటి పరిస్థితులలో కరోనా లాక్ డౌన్ లెక్కచేయకుండా రాజమౌళి తన ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ అప్డేట్ తో బయటకురావడంతో స్వీయ గృహ నిర్భందంలో ఉన్న జనం ‘ఆర్ ఆర్ ఆర్’ మోషన్ పోష్టర్ కు విపరీతమైన స్పందన తెలియచేయడమే కాకుండా వెనువెంటనే చరణ్ పుట్టినరోజునాడు విడుదలైన వీడియో ‘భీమ్ ఫర్ రామరాజు’ కు విపరీతమైన స్పందన రావడంతో కరోనా లాకింగ్ పిరియడ్ ను కూడ రాజమౌళి చాల తెలివిగా ఉపయోగించుకున్నాడు అంటూ కామెంట్స్ వచ్చాయి. దీనితో రాజమౌళి చేసిన పని ప్రభాస్ ఎందుకు చేయడు అంటూ ప్రభాస్ అభిమానులలో తీవ్ర అసంతృప్తి పెరిగి పోయింది. 


దీనికితోడు నిన్న బన్నీ పుట్టినరోజు సందర్భంగా ‘పుష్ప’ ఫస్ట్ లుక్ విడుదల కావడంతో నిన్న మొన్న స్టార్ట్ అయిన సినిమాలే న్యూ అప్డేట్ ఇస్తుంటే ప్రభాస్ మూవీని నిర్మిస్తున్న యూవీ క్రియేషన్స్ సంస్థ ప్రభాస్ అప్డేట్ ఎందుకు ఇవ్వడం లేదంటూ సోషల్ మీడియాలో 'బ్యాన్ యూవీ క్రియేషన్స్' అంటూ ట్రెండ్ ను క్రియేట్ చేసి తమ నిరశన చేసారు. దీనితో ఈ అనుకోని అసహనాన్ని గ్రహించిన యూవీ క్రియేషన్స్ సంస్థ రంగంలోకి దిగి లాక్ డౌన్ సమయంలో అప్ డేట్ ఇవ్వమంటే వీలు కాదని పరిస్థితి కాస్త సర్దుమణిగిన తర్వాత అప్ డేట్స్ ఇస్తామంటూ వివరణ ఇచ్చి పరిస్థితిని అర్ధం చేసుకోవలసిందిగా ప్రభాస్ అభిమానులకు విన్నపాలు చేసారు. దీనితో రాజమౌళి ప్రచార వ్యూహాలు టాలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రమే కాకుండా ప్రభాస్  కు కూడ అనుకోని తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి అనుకోవాలి..  

మరింత సమాచారం తెలుసుకోండి: