సినిమా పరిశ్రమలో హిట్టు ఉన్న వాళ్ళకే క్రేజ్ ఎక్కువ.. హిట్ ఫామ్ కొనసాగిస్తేనే అవకాశాలు వస్తాయి లేదంటే పక్కన పెట్టేస్తారు. ఒకప్పుడు స్టార్స్ తో సినిమాలు తీసిన దర్శకుడు పరిస్థితి ఇప్పుడు అలానే ఉంది. మహేష్, ఎన్టీఆర్, చిరంజీవి వంటి స్టార్స్ తో సినిమాలు తీసిన శ్రీను వైట్ల వరుణ్ తేజ్ తో మిస్టర్, రవితేజతో అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలు చేశాడు. ఆ రెండు కూడా డిజాస్టర్ అవడంతో అతనితో సినిమా అంటే హీరోలే కాదు నిర్మాతలు కూడా దూరంగా జరుగుతున్నారు. 

 

ఇక ఎలాగోలా ఒక మంచి స్క్రిప్ట్ రాసుకున్న శ్రీను వైట్ల బెల్లంకొండ శ్రీనివాస్ కు కథ చెప్పి ఒప్పించినా నిర్మాతలు ఎవరు ముందుకు రావట్లేదని తెలుస్తుంది. శ్రీను వైట్ల కు మార్కెట్ పడిపోయిందని అతనితో సినిమా అంటే నిర్మాతలు దొరకడం కష్టమని హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ను కూడా ఆ ప్రాజెక్ట్ వదులుకోమని సలహాలు ఇస్తున్నారట. శ్రీను వైట్ల మాత్రం ఈసారి హిట్ కొట్టే కథ సిద్ధం చేశాడట. బెల్లంకొండ శ్రీనుని ఎలాగైనా ఒప్పించి సినిమా హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యాడు శ్రీను వైట్ల. 

 

బెల్లంకొండ శ్రీను కూడా చిరు మహేష్ ఎన్టీఆర్ లాంటి హీరోలతో తీసిన డైరక్టర్ కదా అని ఒక ఛాన్స్ ఇచ్చే ఆలోచనలో ఉన్నాడు. కచ్చితంగా ఈ కాంబో మూవీ వచ్చి తీరుతుంది. అయితే ఇంకా నిర్మాత సెట్ అవలేదని తెలుస్తుంది. ప్రొడ్యూసర్ దొరికితే మాత్రం త్వరలోనే ఈ సినిమా అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుందట. మొత్తానికి హిట్టు కోసం శ్రీను వైట్ల, బెల్లంకొండ శ్రీను ఇద్దరు పెద్ద ప్లాన్ చేశారని చెప్పొచ్చు. ఈ సినిమాతో శ్రీను వైట్ల మళ్ళీ తన క్రేజ్ తెచ్చుకోవాలని చూస్తున్నాడు. మరి అది వర్క్ అవుట్ అవుతుందో లేదో చూడాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: