అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అందాల భామ జాన్వీ కపూర్. తొలి సినిమా దడక్‌ తోనే తానేంటో నిరూపించుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉంది. అయితే దడక్‌ తరువాత రెండో సినిమా రిలీజ్‌కు చాలా గ్యాప్ తీసుకుంది జాన్వీ. ఈ గ్యాప్ లో అభిమానులకు దూరం కాకుండా ఉండేందుకు సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉంటుంది జాన్వీ. అంతేకాదు అభిమానుల కోసం కాస్త గ్లామర్ డోస్ పెంచి మరీ ఫోటో షూట్ లు చేస్తోంది ఈ భామ.

 

అయితే జాన్వీ తీరుపై బాలీవుడ్ నిర్మాతలు అసంతృస్తి వక్తం చేస్తున్నారట. శ్రీదేవి వారసురాలిగా జాన్వీపై అందిరికీ ఓ డీసెంట్ ఓపినీయన్‌ ఉందని, కానీ జాన్వీ మాత్రం హాట్ ఫోజులతో ఆ ఇమేజ్‌ను పాడు చేసుకుంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట. జాన్వీకి అస్సలు డ్రెస్‌ సెన్స్ లేదని, ఇన్నర్‌ వేర్‌ బ్రాండ్ అంబాసిడర్‌ లా పొట్టి పొట్టి బట్టలతో రచ్చ చేయటం ఏం బాలేదని ఆమెకు బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తున్నారట.

 

అయితే జాన్వీ మాత్రం తన డ్రెస్ సెన్స్ పై వస్తున్న కామెంట్స్ నాన్సెస్‌ అంటూ కొట్టి పారేసింది. తాను పొట్టి బట్టలతోనే కఫర్ట్‌బుల్‌ గా ఫీల్ అవుతానని, నాకు నచ్చిన బట్టలే వేసుకుంటానని చెప్పేసింది. ప్రస్తుతం ఈ భామ బయోపిక్‌గా తెరకెక్కుతున్న గుంజన్‌ సక్సెనా తో పాటు రూహీ అఫ్జానా, దోస్తానా 2 సినిమాల్లో నటిస్తోంది. ఈ సినిమా తరువాత కరోన్‌ జోహార్‌ భారీగా తెరకెక్కిస్తున్న తక్త్ సినిమాలోనూ కీలక పాత్రల్లో నటించనుంది జాన్వీ.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Frostyyyy 🐣☁️🧚‍♀️🥶❄️🌨

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

మరింత సమాచారం తెలుసుకోండి: