ఢిల్లీ 6 సినిమాలో మసక్కలి పాట ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా సక్సెస్ కాకపోయినా.. మసక్కలి పాట మాత్రం క్లాసిక్‌గా నిలిచిపోయింది. అయితే ఇన్నేళ్ల తరువాత ఈ పాటను రిమిక్స్ చేశారు. తనిష్క బాగ్చీ ఆద్శర్యంలో రీమిక్స్ చేసిన ఈ పాటలో సిద్ధార్థ్ మల్హోత్రా, తార సుతరియాలు నటించారు. అయితే ఈ రీమిక్స్ వర్షన్‌పై విమర్శలు వినిపిస్తున్నాయి.

 

ఇప్పటికే ఒరిజినల్ వర్షన్ సంగీత దర్శకుడు రెహమాన్‌ రీమిక్స్‌ పై తనదైన స్టైల్‌లో స్పందించాడు. ఎవరి మీద విమర్శలు చేయకపోయినా.. `ఎలాంటి షార్ట్ కట్స్‌ లేవు. నిద్ర లేని రాత్రలు. ఎన్నో సార్లు రీ రైట్ చేసిన లిరిక్స్‌. 200 మందికిపై మ్యూజీషియన్స్‌, 365 రోజుల క్రియేటివిటీ అన్ని కలిసి ఓ సంగీతాన్ని సృష్టిస్తాయి. అలాంటి సంగీతం తరాలకు నిలిచి ఉంటుంది. ఈ ప్రయాణంలో దర్శకత్వ శాఖ, మ్యూజిక్ డైరెక్టర్‌, లిరిసిస్ట్, నటులు, డ్యాన్సర్స్‌ ఇలా ఎంతో మంది కష్టపడతారు.` అంటూ ఒరిజినల్‌ మసక్కలిని ఎంజాయ్ చేయండి అంటూ కామెంట్‌ చేశాడు.

 

తాజాగా ఈ రీమిక్స్‌ పై రాకేష్‌ మెహ్రా కూడా స్పందించాడు. ఢిల్లీ 6 సినిమాను ఎంతో ప్రేమతో పాషన్‌తో రూపొందించాం. అందులోని ఐకానిక్‌ సాంగ్‌ను ఎప్పటికీ అలా ఉండనివ్వాలి. ఈ రీమిక్స్‌తో జాగ్రత్తగా ఉండండి. మీ చెవులు పాడవుతాయి. అంటూ కామెంట్ చేశాడు. ఆయనే కాదు లిరిసిస్ట్ ప్రసూన్‌ జోషీ కూడా రీమిక్స్‌ వర్షన్‌పై  మండిపడ్డాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: