హీరో ప్ర‌భాస్ `బాహుబ‌లి` చిత్రం మార్కెట్ మారిపోయింది. అక్క‌డి నుంచి ఏ సినిమా చేసినా పాన్ ఇండియా రేంజ్‌లోనే ఆలోచిస్తున్నాడు ప్ర‌భాస్‌. త‌రువాత అదే స్థాయిలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన చిత్రం సాహో అది అనుకున్నంత హిట్ మాత్రం కాలేక‌పోయింది. అయితే... ప్ర‌స్తుతం ప్ర‌భాస్ రాధాకృష్ణ‌కుమార్ ద‌ర్శకత్వంలో ఓ భారీ చిత్రాన్ని చేస్తున్న విష‌యం తెలిసిందే. ఆ చిత్రానికి `జాన్‌` అనే పేరు ప‌రిశీల‌న‌లో ఉంది. ఈ చిత్రానికి ప్ర‌భాస్ పెద‌నాన్న కృష్ణంరాజుకు చెందిన గోపీకృష్ణా మూవీస్ స‌మ‌ర్ప‌ణ‌లో యూవీ క్రియేష‌న్స్ నిర్మిస్తోంది. క‌రోనా వైర‌స్ ఇత‌ర దేశాల్లో ప్ర‌బ‌లుతున్న స‌మ‌యంలో రిస్క్ అని హెచ్చ‌రిస్తున్న‌ప్ప‌టికీ ప్ర‌భాస్ మాత్రం జార్జియా వెళ్లి అక్క‌డ కీల‌క స‌న్నివేశాల్ని పూర్తి చేసి ఇండియా తిరిగి వ‌చ్చారు. అక్క‌డ చాలా పెద్ద ఫైటింగ్ సీక్వెన్స్‌ని ప్లాన్ చేసి పూర్తి చేశారు. 

 

ప్ర‌తీకూల ప‌రిస్థితుల్లో జార్జియా వెళ్లి వ‌చ్చిన ప్ర‌భాస్ వ‌చ్చిన ద‌గ్గ‌రి నుంచి కూడా ఎవ‌రికీ క‌నిపించ‌కుండా క‌ల‌వ‌కుండా ఆయ‌న‌కు ఆయ‌నే స్వియ నిర్బంధ‌న‌లో ఉండిపోయారు. క్వారెంటైన్‌కే ప‌రిమిత‌మైపోయారు. ఎక్కువ స‌మ‌యం నిద్ర‌కే కేటాయిస్తున్నాడ‌ట‌. ఆ త‌రువాత టైమ్‌ని వీడియో కాల్స్‌కి వినియోగిస్తున్నాడ‌ని చెప్పుకుంటున్నారు. ఆ వీడియో కాల్స్ మాత్రం త‌నకు అత్యంత స‌న్నిహితంగా వుండే అనుష్క‌లో మాట్లాడుతున్నాడ‌ట‌. అంతేకాక‌ ఆ త‌రువాత రానాకి మాత్ర‌మే చేస్తూ క‌బుర్లు చెబుతున్నాడ‌ట‌.

 

ఎవ‌రినీ క‌ల‌వ‌కుండా ఇంట్లోనే టైమ్ స్పెండ్ చేస్తుండ‌టంతో ప్ర‌భాస్‌ తొలి రోజుల్లో ఆయ‌న చాలా బోర్ ఫీల‌య్యాడ‌ట‌. ఆ త‌రువాత నుంచే వీడియో కాల్స్ చేస్తూ అనుష్క, రానాల‌తో కాల‌క్షేపం చేస్తున్నాడ‌ని, మిగ‌తా టైమ్ అంతా నిద్ర‌కే కేటాయిస్తున్నాడ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. మొత్తానికి ఎంత ఇంట్ర‌స్టింగ్‌గా ఇంత విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో కూడా సినిమాను పూర్తి చేసి వ‌చ్చాడో. అంతే జాగ్ర‌త్త‌లు కూడా ప్ర‌భాస్ తీసుకుంటున్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వ‌ర‌కూ బ‌య‌ట‌కు రాలేదు. అంతేకాక అత్యంత భారీ మొత్తాన్ని విరాళంగా ఇచ్చింది కూడా ప్ర‌భాసే. 4 కోట్లు వ‌ర‌కు ఆయ‌న స‌హాయ‌నిధికి ఇచ్చారు. దీంతో ప్ర‌భాస్ రీల్ లైఫ్‌లో మాత్ర‌మే కాదు రియ‌ల్ లైఫ్‌లో కూడా హీరో అంటున్నారు ఫ్యాన్స్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: