మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమా ఆచార్యలో హీరోయిన్ మొదటగా త్రిషను తీసుకున్న సంగతి తెలిసిందే. మరో వారం రోజుల్లో షూటింగ్ అనగా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్టు ట్వీట్ చేసి యూనిట్ కు తెలుగు ఆడియన్స్ కు షాక్ ఇచ్చింది త్రిష. క్రియేటివ్ డిఫరెన్సెస్ తో తప్పుకుంటున్నట్టు చెప్పిన విషయం కూడా తెలిసిందే. నిజానికి మొదటి నుంచీ సినిమా యూనిట్ హీరోయిన్ విషయంలో సైలెంట్ గానే ఉంది. అయితే.. త్రిష ఆచార్య నుంచి తప్పుకోవడానికి అసలు కారణం క్రియేటివ్ డిఫరెన్సెస్ కాదని తెలుస్తోంది.

 

 

దీనిపై కొందరు సన్నిహతుల వద్ద వచ్చిన డిస్కషన్ లో చిరంజీవి అసలు కారణం చెప్పినట్టుగా ఫిలింనగర్ లో ఓ వార్త రౌండ్ అవుతోంది. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొన్నియన్ సెల్వన్ సినిమా కోసం త్రిష బల్క్ డేట్స్ ఇచ్చిందట. డేట్స్ అడ్జస్ట్ చేయలేకే ఆచార్య నుంచి తప్పుకుందట. నిజానికి త్రిషకు సంబంధించి కాస్ట్యూమ్స్ కూడా రెడీ అయ్యాయని.. త్రిష నిర్ణయం తమకే షాక్ ఇచ్చిందని చిరంజీవి చెప్పినట్టు వార్త చక్కర్లు కొడుతోంది. టీమ్ తో గానీ.. ఆమె పాత్ర విషయంలో గానీ ఎటువంటి మార్పులు లేవని కూడా చెప్పినట్టు సమాచారం.

 

 

ఈ వార్తపై అఫిషియల్ క్లారిటీ లేకపోయినా ప్రస్తుతానికి వైరల్ అయింది. త్రిష స్థానంలో కాజల్ ను ఎంపిక చేసింది చిత్ర యూనిట్. త్రిష మాత్రం చిరంజీవికే షాక్ ఇవ్వటం మాత్రం మెగా అభిమానులకు కోపం తెప్పించింది. ఇండస్ట్రీలో కూడా త్రిషపై పలు విమర్శలు వచ్చాయి. తెలుగు సినిమాకు కమిట్ మెంట్ ఇచ్చాక కూడా తమిళ సినిమా కోసం త్రిష తీసుకున్న నిర్ణయం చిత్ర యూనిట్ కు నష్టం కలిగించింది. కరోనా పరిస్థితులు చక్కబడ్డాక షూటింగ్ జరిపి ఈ సినిమాను దసరాకు రిలీజ్ చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: