టాలీవుడ్ లో మెగా హీరో పవన్ కళ్యాన్ కి ఓ ప్రత్యేక స్థానం ఉంది.  మెగాస్టార్ చిరంజీవి తర్వాత అంత గొప్ప స్థానం పవర్ స్టార్ పవన్ కళ్యాన్ సంపాదించారు.  అన్నబాటలోనే రాజకీయాల్లోకి కూడా వెళ్లారు. రాజకీయాల కోసం రెండేళ్లకు పైగా లాంగ్ గ్యాప్ తీసుకున్న పవన్ కళ్యాణ్ వరసగా మూడు సినిమాలు ప్రకటించారు. ప్రస్తుతం బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ రిమేక్ తెలుగు లో తీస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో  వస్తున్న ఈ మూవీకి ‘వకీల్ సాబ్’ టైటిల్ ఫిక్స్ చేశారు.  ఈ మూవీ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో మూవీలో నటిస్తున్నారు.  

 

గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే. వకీల్ సాబ్ మూవీ తర్వాత క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించబోతున్న విషయం తెలిసిందే.  క్రిష్ పవన్ సినిమాను పీరియాడిక్ మూవీగా తెరకెక్కుతున్న క్రమంలో ఈ సినిమాలో పవన్ బందిపోటుగా కనిపిస్తారని తెలుస్తుంది. అయితే ఈ సినిమాకు ‘విరూపాక్షి’ అనే ఓ క్లాసిక్ టైటిల్ అనుకుంటున్నారని సమాచారం. మొఘల్ చక్రవర్తుల కాలంలో ఈ కథ నడుస్తుందనేది తాజా సమాచారం.

 

 

ఇక పవన్ కనిపించేది కూడా సాధారణమైన దొంగగా కాదు .. కోహినూర్ వజ్రాన్ని కాజేయడానికి ప్రయత్నించే ఘరానా దొంగగా అని తెలుస్తోంది. ఔరంగజేబు పాత్రలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ కనిపించనున్నాడు. ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా జాక్విలిన్ ను తీసుకున్నట్లు సమాచారం.. అయితే ఔరంగజేబు సోదరి పాత్రలో ఆమె కనిపించనుందని అంటున్నారు.  అయితే ఈ మూవీలో పవన్ - జాక్విలిన్ మద్య ప్రేమ యాంగిల్ సూపర్ గా ఉండబోతుందట. మొత్తానికి ఈ మూవీ కథ అంతా కూడా కోహినూర్ వజ్రం చుట్టూనే తిరుగుతుందని చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: