మెగాస్టార్ చిరంజీవి తన మనసులో విషయాన్ని దాచుకునే వ్యక్తి కాదు. చాలా క్యాజువల్ గా మరియు సరదాగా ఆయన ఉండటం వల్ల మెగాస్టార్ కు పెద్దగా ఇబ్బందులు కలగకున్నా.. థియేటర్లలో ప్రేక్షకులను థ్రిల్ చేయాలనుకునే డైరెక్టర్ మరియు చిత్రబృందం కి ఆయన ఇలా అన్ని విషయాలు ఓపెన్ అయిపోవడం వల్ల కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది. కొద్దిరోజుల ముందే ఒక ఫంక్షన్ కి వచ్చి కొరటాల శివ దర్శకత్వంలో తాను చేస్తున్న సినిమా పేరు 'ఆచార్య' అని చిరంజీవి చెప్పిన విషయం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. ఇకపోతే మెగాస్టార్ ఇప్పుడు ఆచార్య గురించి ఇలాగే మరొక అదిరిపోయే అప్ డేట్ ఇచ్చాడు.

 

గతంలో చిరు పక్కన ఆచార్య లో ఒక ముఖ్యమైన పాత్రలో మహేష్ బాబు కనిపించనున్నాడు అని అందరూ అనుకున్న విషయం తెలిసిందే. అయితే ఇక మహేష్ రోల్ పై అనేక ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో చిరు చేసిన వ్యాఖ్యలు వాటిల్లో మాత్రం నిజం లేదని తేల్చచెప్పాయి. ఇప్పుడు ప్రత్యేక పాత్రలో తన సరసన అతని తనయుడు రామ్ చరణ్ కనిపించబోతున్నాడు అని చిరంజీవి సస్పెన్స్ కు తెర దేశాడు. ఎంతో గోప్యంగా ఉంచుదాం అనుకున్న విషయం కాస్తా చిరు అలా చెప్పేయడం తలలు పట్టుకోవడం ఆచార్య టీమ్ వంతు అయింది.

 

తానే స్వయంగా రాజమౌళితో మాట్లాడి, చరణ్ నెలరోజులు తమ షూటింగ్‌లో పాల్గొనేలా ఒప్పించానని చెప్పారు చిరూ. అంతేనా... సినిమాలో తాము తండ్రికొడుకుల్లా కనిపించడం లేదని, గురు-శిష్యుల్లా మా పాత్రలు ఉంటాయని అసలు విషయం రివిల్ చేసేశారు మెగాస్టార్.  అయితే సినిమా ప్రమోషన్‌లో ఇది కూడా స్ట్రాటెజీయే అంటున్నారు కొందరు. ఇక మెగాస్టార్ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించబోతున్నాడని, రోల్‌లో కనిపిస్తాడనేది ఫ్యాన్స్‌కు క్లారిటీ వచ్చేసింది. దీంతో సినిమాపై భారీ అంచనాలు పెంచేశారు మెగాస్టార్.

మరింత సమాచారం తెలుసుకోండి: